ETV Bharat / state

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 366 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

author img

By

Published : Aug 25, 2021, 9:54 PM IST

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 366 కరోనా కేసులు.. ఇద్దరు మృతి
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 366 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మారుతోంది. ఒకరోజు తగ్గినట్లే కనిపిస్తున్నా... మరుసటి రోజుకు వచ్చేసరికి నమోదులో కాస్త పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా మరో 366 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 80,470కరోనా పరీక్షలు నిర్వహించగా.. 366 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,56,098కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

24 గంటల వ్యవధిలో కొవిడ్​ బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,864కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 345 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,45,939కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,295 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: Corona Cases: దేశంలో కొత్తగా 25,467మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.