ETV Bharat / state

Congress Chevella Praja Garjana Sabha : ఈ నెల 26న చేవెళ్ల ప్రజాగర్జన సభ.. SC, ST డిక్లరేషన్​ విడుదల చేయనున్న ఖర్గే

author img

By

Published : Aug 19, 2023, 6:47 PM IST

Revanth Reddy
Revanth Reddy latest comments

Congress Chevella Praja Garjana Sabha : ఈ నెల 26న చేవెళ్ల ప్రజాగర్జన సభ నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని ఆయన తెలిపారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్​ కార్యాచరణను వివరించారు.

Congress Chevella Meeting : హైదరాబాద్​లోని గాంధీభవన్​లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ (TPCC) విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్​.. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల ప్రజా గర్జన సభ (Chevella Congress Pubilc Meeting) నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని వివరించారు. ఈ బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ను ఖర్గే విడుదల చేస్తారని రేవంత్​ స్పష్టం చేశారు.

ఖమ్మం సభలాగే చేవెళ్ల సభను తెలంగాణ ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఈ నెల 29వ తేదీన మైనారిటీ డిక్లరేషన్ (Minority Declaration) వరంగల్​లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. మహిళా డిక్లరేషన్ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామని తెలిపారు. అలాగే కాంగ్రెస్​ మేనిఫెస్టో విడుదలకు ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానిస్తామని రేవంత్​రెడ్డి వివరించారు. ఈ క్రమంలోనే ఓబీసీ (OBC), మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తామని తెలిపారు.

Revanth Reddy on Chevella Prajagarjana Sabha : ఈ సందర్భంగా తమ పార్టీ కార్యచరణను వివరించారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్​ నేతలను ఆదేశించారు. అలాగే 'తిరగబడదాం.. తరిమికొడదాం' కార్యక్రమాన్ని గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్​ పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్లమెంట్ వారీగా కో-ఆర్డినేటర్లను నియమించినట్లు రేవంత్​ పేరొన్నారు. ఈ నెల రోజులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.

Chevella Congress Pubilc Meeting : కార్యక్రమంలో మాట్లాడిన మాణిక్​రావ్​ ఠాక్రే (ManikRao Thackeray).. కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్స్, ఛార్జ్ షీట్స్, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. కర్ణాటక తరహాలో కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ఇంటింటికీ చేరేలా చూడాలని పేర్కొన్నారు. 'హాథ్​ సే హాథ్​ జోడో' కార్యక్రమం తరహాలో ప్రస్తుత కార్యాక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వీరితో పాటు ఏఐసీసీ ఇంఛార్జ్​ కార్యదర్శి మన్సూర్‌ అలీ ఖాన్, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్‌బాబు, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ, సీఎల్పీ (CLP) నేత భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, నాయకులు పొన్నం ప్రభాకర్, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Congress MLA Ticket Applications : కాంగ్రెస్‌ రేసుగుర్రాల ఎంపిక.. తొలిరోజు 18 దరఖాస్తులు

Revanthreddy Speech in Lok Sabha : 'ప్రపంచంలోనే అత్యధిక అబద్ధాల పుస్తకం.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో'

Minister Srinivas Goud fires on Revanth Reddy : " రేవంత్​రెడ్డి బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు: శ్రీనివాస్​గౌడ్​"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.