ETV Bharat / state

TRS portest on fuel rates: ధరల పెంపుపై సీఎం ఆగ్రహం.. నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

author img

By

Published : Mar 24, 2022, 5:15 AM IST

TRS portest on fuel rates: పెంచిన గ్యాస్, ఇంధన ధరలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని ఆదేశించారు.

TRS portest on fuel rates
TRS portest on fuel rates

TRS portest on fuel rates: గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై ఆందోళనలు చేపట్టాలని తెరాస శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఇవాళ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కేసీఆర్ తెలిపారు. కేంద్ర చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా ఆందోళనలు చేపట్టాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం హద్దు పద్దూ లేకుండా గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలు పెంచుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. కేసీఆర్ పిలుపు మేరకు రేపు నిరసన ప్రదర్శనలకు తెరాస ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు సన్నాహాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ఉద్దృతం చేయాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.

  • ఇదీ చూడండి:
  • Fire Accident in Timber Depot : టింబర్‌ డిపోలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.