సెక్రటేరియట్, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు, సిబ్బంది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెంటనే అందించాలని వివిధ హెచ్వోడీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, సెక్రటరీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల విధులకు ఎక్కువ మంది కావాల్సి ఉన్న దృష్ట్యా సెక్రటేరియట్, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల స్టాఫ్, అధికారులను ఉపయోగించుకోవాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ఆదేశాలిచ్చారు.
రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్ను, ఎక్సైజ్ తదితర పన్ను సంబంధింత కార్యకలాపాల శాఖల ఉద్యోగులకు మినహాయింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు