ETV Bharat / state

చెట్లను నాటడం మనందరి బాధ్యత: సీఎస్​ సోమేశ్​కుమార్

author img

By

Published : Dec 22, 2022, 10:18 PM IST

Chief Secretary Somesh Kumar planted the sapling
ప్రతి ఒక్కరూ గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ పాల్గొనండి

తన పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కులో సీఎస్​ సోమేశ్​ ఆయన మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆయన కోరారు.

జీవ కోటికి ప్రాణవాయువును అందించే చెట్లను నాటడం మనందరి బాధ్యతని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ అన్నారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కులో ఆయన మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్, హెచ్​ఎండీఏ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సమాజం పట్ల బాధ్యత, భవిష్యత్తు తరాల బాగు కోసం ప్రకృతి పట్ల అవగాహనతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్​కుమార్ తీసుకున్న ఈ వనయజ్ఞంలో ప్రజలంతా స్వచ్ఛందంగా మొక్కలు నాటడం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక అయిన హరిత హారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు హరితహారంలో.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.