ETV Bharat / state

ఏప్రిల్‌ 1 నుంచి సరళీకృత జీఎస్టీ: నిర్మలా సీతారామన్​

author img

By

Published : Feb 16, 2020, 4:52 PM IST

Updated : Feb 16, 2020, 6:00 PM IST

central finance minister nirmala sitharaman
నిర్మలా సీతారామన్​

జీఎస్టీలో సరళీకృత విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. చిన్నతరహా పారిశ్రామికవేత్తలతో హైదరాబాద్​లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

ఏప్రిల్‌ 1 నుంచి సరళీకృత జీఎస్టీని పూర్తిస్థాయిలో వర్తింపజేస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. హైదరాబాద్​లోని ఓ హోటల్లో చిన్నతరహా పారిశ్రామికవేత్తల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు.

జీఎస్టీకి సంబంధించిన సందేహాలు సమస్యలను నివృత్తి చేయడానికి కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్‌ బోర్డు బృందం ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనుందని తెలిపారు. సీబీఐసీ ఛైర్మన్ శేషగిరిరావు బృందం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పర్యటించి జీఎస్టీపై ఉన్న సందేహాలు నివృత్తి చేస్తారని నిర్మలాసీతారామన్‌ వివరించారు.

ఏప్రిల్‌ 1 నుంచి సరళీకృత జీఎస్టీ: నిర్మలా సీతారామన్​

ఇవీ చూడండి: 50 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత

Last Updated :Feb 16, 2020, 6:00 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.