ETV Bharat / state

Central Cabinet Approves Two Multi Tracking Railway Projects In Telangana : ఆ రెండు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్​సిగ్నల్.. వ్యయం రూ.9వేల కోట్లు

author img

By

Published : Aug 16, 2023, 7:39 PM IST

Union Cabinet Approves Two Multi Tracking Projects In Telangana : రాష్ట్రంలోని రెండు కీలక రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం పచ్చజెండా ఊపింది. గుంటూరు-బీబీనగర్ సింగిల్​ డబ్లింగ్​​; ముద్కేఢ్-మేడ్చల్, మహబూబ్‌నగర్-డోన్ మధ్య డబుల్​ డబ్లింగ్​ వంటి రెండు కీలక మార్గాల్లో సుమారు రూ. 9వేల కోట్లతో పనులు జరగనున్నాయి.

Two Multi Tracking Projects In Telangana
Central Cabinet Approves Three Multi Tracking Railway Projects In Telangana

Cabinet Clear Two Telangana Multi Tracking Railway Projects : రాష్ట్రంలోని కీలక రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం పచ్చజెండా ఊపింది. గుంటూరు-బీబీనగర్ సింగిల్​ డబ్లింగ్​​, ముద్కేఢ్-మేడ్చల్, మహబూబ్‌నగర్-డోన్ మధ్య డబుల్​ డబ్లింగ్​ వంటి రెండు కీలక రైల్వే డబ్లింగ్​ ప్రాజెక్టు(Railway Multi Tracking Projects)లకు కేంద్ర కేబినెట్​​ ఆమోదముద్ర వేసింది. వీటిని సుమారు రూ.9వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఏప్రిల్​ నెలలో ప్రధాని హైదరాబాద్​ పర్యటనకు విచ్చేసినప్పుడు.. రూ.1,410 కోట్లతో నిర్మించిన 85 కిలోమీటర్ల డబ్లింగ్​ రైల్వే లైన్​ను జాతికి అంకితం ఇచ్చారు.

గుంటూరు-బీబీనగర్​ మార్గంలో 239 కిలోమీటర్ల డబ్లింగ్​ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్​(Central Cabinet)​ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టును రూ.3,238 కోట్లతో 239 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. హైదరాబాద్​-చెన్నై మధ్య 76 కిలోమీటర్ల దూరం తగ్గనుందని రైల్వే శాఖ(Railway Ministry) తెలిపింది. అలాగే హైదరాబాద్​-విజయవాడ మధ్య కూడా దూరం తగ్గనుంది. ఈ మార్గం అభివృద్ధి చేయడం ద్వారా నగరాల మధ్య రైళ్ల వేగం కూడా పెరగనుంది. సిమెంట్​ పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో.. సరుకు వేగం కూడా పెరిగేందుకు ఆస్కారం ఉందని రైల్వే శాఖ అభిప్రాయ పడుతోంది.

ముద్కేఢ్​-మేడ్చల్​, మహబూబ్​నగర్​-డోన్ మధ్య డబ్లింగ్​ పనులకు ఆమోదం : ఇంకోవైపు ముద్కేఢ్​-మేడ్చల్​, మహబూబ్​నగర్​-డోన్ మధ్య రూ.5618 కోట్ల విలువ చేసే డబుల్​ డబ్లింగ్​ పనులకు కూడా కేంద్ర కేబినెట్​ పచ్చజెండా ఊపింది. ఈ మార్గాల అభివృద్ధితో హైదరాబాద్​-బెంగళూరు మధ్య 50 కిలోమీటర్ల మేర ప్రయాణ దూరం తగ్గనుందని రైల్వేశాఖ వెల్లడించింది. ఈ కొత్త మార్గం పూర్తయితే వందే భారత్​ వంటి రైళ్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

దక్షిణ మధ్య రైల్వే జీఎం హర్షం : కేంద్ర కేబినెట్​ రెండు రైల్వే ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేయడం పట్ల దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్​ కుమార్​ జైన్​ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ప్రాంతాల ప్రజలకు ఈ రెండు ప్రాజెక్టులతో ఎంతో ఉపయోగం ఉందని వివరించారు. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముద్కేఢ్​-డోన్ మధ్య ఉన్న 417.88 కిలోమీటర్ల డబ్లింగ్​ పనులకు రూ.4,686.09 కోట్లను అంచనా వ్యయంగా కేటాయించారని వెల్లడించారు. రామగుండం, ముద్దనూరు, బెల్లారి థర్మల్​ ప్లాంట్స్​ వయా పెద్దపల్లికి బొగ్గు సరఫరా చేసేందుకు వీలవుతోందని ప్రకటించారు. ​

Modi Visit To Hyderabad In April 2023 : ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్​ నెలలో హైదరాబాద్​ పర్యటనలో రూ.11,355 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే సికింద్రాబాద్​ నుంచి తిరుపతికి రెండో వందే భారత్​ రైలును ప్రారంభించారు. రూ.715 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ ఆధునీకరణ పనులను శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్​-మహబూబ్​నగర్​ మధ్య రూ.1,410 కోట్లతో నిర్మించిన 85 కిలోమీటర్ల డబ్లింగ్​ రైల్వే లైన్​ను జాతికి అంకితం ఇచ్చారు. ఎంఎంటీఎస్​ రెండో దశలో 13 కొత్త ఎంఎంటీఎస్​ రైళ్లను ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.