ETV Bharat / state

నా కారు ఎవరో ఎత్తుకెళ్లారు.. పోలీసులకు చీకోటి ప్రవీణ్ ఫిర్యాదు

author img

By

Published : Feb 22, 2023, 10:21 AM IST

Updated : Feb 22, 2023, 5:41 PM IST

Thieves Took Chikoti Praveen Car
Thieves Took Chikoti Praveen Car

Chikoti Praveen Car theft : తన కారును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని క్యాసినో వ్యాపారి చీకోటి ప్రవీణ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కొంతమంది వారం రోజులుగా తన ఇంటిపై రెక్కీ నిర్వహిస్తున్నారని పోలీసులకు తెలిపారు. రెక్కీ నిర్వహించిన వారే ఈనెల 20న తెల్లవారుజామున తన కారును దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నా కారు ఎవరో ఎత్తుకెళ్లారు.. పోలీసులకు చీకోటి ప్రవీణ్ ఫిర్యాదు

Chikoti Praveen Car theft : క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారట. తన కారు చోరీకి గురైందని ఆయనే స్వయంగా సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది దుండగులు గతవారం రోజులుగా తన ఇంటి రెక్కీ నిర్వహిస్తున్నట్లు ప్రవీణ్ తెలిపారు. తన కారు చోరీ అయిన తర్వాత సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తే రెక్కీ నిర్వహించిన వారే ఎత్తుకెళ్లినట్లు తేలిందని పోలీసులకు వివరించారు. గతంలో కూడా పలుమార్లు అనుమానాస్పద యువకులు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశానని చీకోటి వెల్లడించారు.

నా కారు ఎవరో ఎత్తుకెళ్లారు.. పోలీసులకు చీకోటి ప్రవీణ్ ఫిర్యాదు

Chikoti Praveen Car theft case : ఈనెల 20న తెల్లవారుజామున దుండగులు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి కారు చోరీ చేశారని ప్రవీణ్ తెలిపారు. ఇన్నోవా క్రిస్ట్ టీఎస్11ఈక్యూ0444 గల వాహనాన్ని దుండగులు ఎత్తుకెళ్లారని పోలీసులకు వివరించారు. వెంటనే కారు చోరి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని కోరారు. అర్ధరాత్రి సమయంలో తన ఇంట్లోకి ప్రవేశించే క్రమంలో విఫలమైన దుండగులు అతని అపార్ట్మెంట్​ పార్కింగ్​లో ఉన్న కారును ఎత్తుకెళ్లారని చీకోటి ప్రవీణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని.. సైదాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. దుండగుల కోసం గాలింపు మొదలుపెట్టారు.

Chikoti Praveen Car theft in Hyderabad : గత సంవత్సరం సంక్రాంత్రి సంబురాల్లో గోవా తరహాలో క్యాసినో ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చీకోటి ప్రవీణ్ ఓ కుదుపు కుదుపిన విషయం తెలిసిందే. దీంతో దుండగులు చీకోటి ప్రవీణ్ ఇంట్లో వేల కోట్ల రూపాయలు ఉంటాయనే ఆలోచనతోనో.. రెక్కీ నిర్వహించి ఉంటారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ముప్పు ఉంది పోలీసులు భద్రత కల్పించాలి: గతంలో ఈడీ విచారణ ముగిసే వరకు తనకు పోలీసు భద్రత కల్పించాలని చీకోటి ప్రవీణ్ పోలీసులకు కోరారు. దీనిపై వారు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఈడీ విచారణ వల్ల తన కుటుంబానికి ముప్పు ఏర్పడిందని పిటిషన్​లో చీకోటి ప్రవీణ్ పేర్కొన్నారు. తన ఇంటి వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్నారని కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో హైకోర్టు చీకోటికి భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించింది. అతని దరఖాస్తును పరిగణనలోకి తీసుకోని నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్​ సీపీకి సూచించింది.

ఇవీ చదవండి:

Last Updated :Feb 22, 2023, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.