ETV Bharat / state

ఈ నెల 29న ప్రగతిభవన్‌లో బీఆర్​ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

author img

By

Published : Jan 27, 2023, 10:14 AM IST

Updated : Jan 27, 2023, 11:41 AM IST

kcr
kcr

10:10 January 27

ఈ నెల 29న ప్రగతిభవన్‌లో బీఆర్​ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

BRS Parliamentary Meeting on 29th: ఈ నెల 29న ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో.. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇదే అంశంపై పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు.

మరోవైపు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు విడతల్లో ఏప్రిల్‌ 6వ తేదీ వరకు సాగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి శుక్రవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఆ వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచుతారు. రెండో రోజైన ఫిబ్రవరి 1న 2023 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి సమర్పిస్తారు.

ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు విడతల్లో ఏప్రిల్‌ 6వ తేదీ వరకు సాగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఆ వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచుతారు. రెండో రోజైన ఫిబ్రవరి 1న 2023 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి సమర్పిస్తారు.

రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ తుది రూపు సంతరించుకుంటోంది. బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు నిర్వహించే సంప్రదాయ హల్వా వేడుక దిల్లీలో గురువారం ఘనంగా జరిగింది. నార్త్​ బ్లాక్​లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవంత్ కిషన్ రావ్ కారాడ్, ఆ శాఖ సీనియర్ అధికారులు సైతం ఈ హల్వా వేడుకలో భాగమయ్యారు. బడ్జెట్ రూపకల్పనలో సహకరించిన అధికారులు, సిబ్బందికి మంత్రి నిర్మల సీతారామన్ హల్వా అందించారు.

కేంద్ర బడ్జెట్​కు సంబంధించి చివరి అంకం ప్రారంభం: ఈ కార్యక్రమంతో కేంద్ర బడ్జెట్​కు సంబంధించి చివరి అంకం ప్రారంభమైనట్లు భావిస్తారు. సాధారణంగా హల్వా వేడుక నిర్వహించిన తర్వాతే బడ్జెట్ పత్రాలను ముద్రిస్తారు. బడ్జెట్‌ సంబంధించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచుతారు. బడ్జెట్‌ కసరత్తు మొదలవ్వగానే నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు విలేకర్లను కూడా అనుమతించరు. ఆర్థిక శాఖకు చెందిన కొందరు కీలక సిబ్బంది ఈ క్రతువులో పాల్గొంటారు.

పదిరోజుల ముందు ప్రతుల ముద్రణ: బడ్జెట్‌ సమర్పించడానికి పదిరోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇది ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం బేస్‌మెంట్‌లో జరుగుతుంది. దీనిలో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉండి పోతారు. ఈ ముద్రణ మొదలు కావడానికి ముందు భారతీయ వంటకమైన హల్వాను చేస్తారు. దీనిని ఆర్థిక మంత్రి సమక్షంలో దీనిని సిబ్బందికి పంచుతారు.

ఎన్నికల బడ్జెట్‌లో ఆ దూకుడును కొనసాగించకపోవచ్చు: కార్మిక సంఘాలు, విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ముందుకెళ్తున్న మోదీ ప్రభుత్వం.. ఎన్నికల బడ్జెట్‌లో ఆ దూకుడును కొనసాగించకపోవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా వేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సేకరించే లక్ష్యాన్నిఈసారి రూ.40,000 కోట్లకే పరిమితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. గత బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యానికి ఆమడ దూరంలో నిలవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదల, ఎన్నికల ముందు వ్యతిరేకత వస్తుందనే భయం ఇందుకు కారణాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి: సీఎం కేసీఆర్​ను కలిసిన ఛత్రపతి శివాజీ వారసుడు

అంతా 'మోదీ'మయమే.. తగ్గని ప్రజాదరణ.. ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠంపై!

Last Updated :Jan 27, 2023, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.