ETV Bharat / state

'గవర్నర్​ వ్యవహారశైలిని దేశం ముందు ఉంచేందుకే.. ఈ బహిష్కరణ నిర్ణయం'

author img

By

Published : Jan 31, 2023, 6:32 PM IST

BRS MPs
BRS MPs

BRS MPs boycotts President speech in parliament: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్​ఎస్, ఆప్​లు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి. బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో చేసిన వైఫల్యాలకు నిరసనగానే తాము ఈ ప్రసంగాన్ని బహిష్కరించినట్లు బీఆర్​ఎస్ ఎంపీలు ప్రకటించారు.

BRS MPs boycotts President speech in parliament : బీఆర్​ఎస్​, ఆమ్​ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి. బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో చేసిన వైఫల్యాలకు నిరసనగానే తాము ఈ ప్రసంగాన్ని బహిష్కరించినట్లు బీఆర్​ఎస్​ ఎంపీలు ప్రకటించారు. తెలంగాణ, దిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారాయన్న బీఆర్​ఎస్​ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు.. వీటిని దేశ ప్రజల ముందు పెట్టేందుకే తామీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

'గవర్నర్​ వ్యవహారశైలిని దేశం ముందు ఉంచేందుకే.. ఈ బహిష్కరణ నిర్ణయం'

రాష్ట్రపతి ప్రసంగంలో మహిళాబిల్లు ప్రస్తావన ఏది అని బీఆర్​ఎస్ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. పార్లమెంట్‌కు అంబేద్కర్‌ పేరు, రైతులకు ఎంఎస్‌పీ వంటి అంశాలు ప్రస్తావనకు రాకపోవడం బాధాకరమని నామా నాగేశ్వరరావు అన్నారు. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ షేర్లు పడిపోవడానికి కారణాలపై ఉభయ సభల్లో చర్చించాల్సి ఉందన్నారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రధాన అంశాలను పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తామని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, తెలంగాణపై కుట్రలను పార్లమెంట్‌లో ఎండగడతామని తెలిపారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెంపు, మహిళా రిజర్వేషన్‌ బిల్లు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతుల ఆదాయం రెట్టింపుపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని అఖిలపక్ష సమావేశంలో డిమాండ్‌ చేసినట్లు నాగేశ్వరరావు తెలిపారు.

బీఆర్​ఎస్ ఎంపీలపై ఫైర్ అయిన కిషన్​రెడ్డి : రాజ్యాంగాన్ని గౌరవించడం చేతకాని సీఎం కేసీఆర్.. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని పదే పదే అవమానపరుస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీలనే కాదు చివరకు గవర్నర్లను, ప్రధానిని, రాష్ట్రపతిని కూడా గౌరవించడం కేసీఆర్​కు రాదని ఆరోపించారు. 'ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్​ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేసి.. ఆయన్ను సస్పెండ్ చేసిన మీరు.. మాకు నీతులు చెబుతారా' అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

పార్లమెంట్లో రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేయాలంటూ బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ పిలుపునివ్వడం.. రాజ్యాంగానికి, రాజ్యాంగబద్ధ సంస్థలకు, రాజ్యాంగబద్ధ పదవులకు కేసీఆర్​ ప్రభుత్వం ఇచ్చే గౌరవానికి నిదర్శనమని కిషన్​రెడ్డి ఆరోపించారు. ప్రతిసారి రాజీనామాకు సిద్ధమని చెప్పే బీఆర్​ఎస్​ నాయకులని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. 'మీరు రాజీనామా చేయాల్సిన పని లేకుండానే రోబోయే ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని' కిషన్​రెడ్డి దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.