ETV Bharat / state

సెప్టెంబర్​ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని యాత్ర

author img

By

Published : Sep 8, 2020, 6:47 AM IST

సెప్టెంబర్​ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని యాత్ర
సెప్టెంబర్​ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని యాత్ర

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోని బృందం రెండు రోజుల యాత్ర చేపట్టింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద యాత్ర ప్రారంభంకానుంది. రజాకార్ల అరాచకాలు, అకృత్యాలకు గురైన స్థలాలను భాజపా సందర్శించనుంది.

రజాకార్ల అరాచకాలు, అకృత్యాలకు గురైన స్థలాలను భాజపా సందర్శించనుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోని బృందం రెండు రోజుల యాత్ర చేపట్టింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద యాత్ర ప్రారంభంకానుంది.

హైదరాబాద్ నుంచి యాత్ర నేరుగా యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక చేరుకుంటుంది. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా బైరాన్ పల్లికి వెళుతుంది. బైరాన్ పల్లి బురుజు వద్ద నివాళులు అర్పించిన తరువాత వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలోని అమరధామంను నేతలు సందర్శించనున్నారు. పరకాల నుంచి బయలుదేరి గోదావరిఖనిలో రాత్రి బస చేస్తారు.

బుధవారం ఉదయం అక్కడి నుంచి యాత్ర బయల్దేరి కుమురం భీం జిల్లా జోడేఘాట్​కు చేరుకుంటుంది. అక్కడి నుంచి వేయి ఊడలమర్రి, అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా దాశరథి జైలు వద్ద ముగుస్తుంది. భవిష్యత్ తరాలకు చరిత్రను చాటి చెప్పేలా యాత్ర ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్​ ఫారెస్ట్​ను దత్తత తీసుకున్న ప్రభాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.