ETV Bharat / state

'ప్రజలు ఇప్పటికైనా గ్రహించి భాజపాకు ఓటేయాలి'

author img

By

Published : Nov 27, 2020, 6:24 PM IST

'ప్రజలు ఇప్పటికైనా గ్రహించి భాజపాకు ఓటేయాలి'
'ప్రజలు ఇప్పటికైనా గ్రహించి భాజపాకు ఓటేయాలి'

హైదరాబాద్ జియాగూడ డివిజన్​లో భాజపా అభ్యర్థి దర్శన్, ఎన్నికల ఇంఛార్జి బొడిగె శోభ మీడియా సమావేశం నిర్వహించారు. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలు భాజపాకు ఓటేయాలని కోరారు.

మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ చేసిన వ్యాఖ్యలపై జియాగూడ భాజపా కార్పొరేటర్ అభ్యర్థి దర్శన్, ఎన్నికల ఇంఛార్జి బొడిగె శోభ ఖండించారు. పీవీ, ఎన్టీఆర్​పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసినా... ఇంతవరకు సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు.

అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలని శోభ డిమాండ్ చేశారు. వరద సమయంలో బస్తీకి రాని కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ప్రజలు ఇప్పటికైనా... గ్రహించి భాజపాకు ఓటు వేయాలని కోరారు.

'ప్రజలు ఇప్పటికైనా గ్రహించి భాజపాకు ఓటేయాలి'

ఇదీ చూడండి:హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే భాజపాకు పట్టం కట్టండి: బండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.