ETV Bharat / state

కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ.. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయంటూ..

author img

By

Published : Mar 27, 2023, 4:37 PM IST

bandi
bandi

Bandi Sanjay letter to KCR : విద్యుత్‌శాఖలో పనిచేసే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు. వారికి ఇవ్వాల్సిన పీఆర్సీ, జీపీఎఫ్ వంటి సమస్యల విషయంలో ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు, ఆర్టిజన్లతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు.

Bandi Sanjay letter's to KCR about electricity employees: విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు, ఉద్యోగులకు జీపీఎఫ్‌, పీఆర్‌సీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం అనేక నెలలుగా ఆందోళన చేస్తున్నారని, దాదాపు 23వేల మందికి పైగా ఉన్న వీరి సమస్యల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గర్హనీయమన్నారు.

ఆర్టిజన్లు, ఉద్యోగుల పట్ల విద్యుత్ శాఖ యాజమాన్యం, రాష్ట్ర సర్కార్ కనీసం శ్రద్ధ చూపకపోవడం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని కనబరుస్తోందని తెలిపారు. జీపీఎఫ్, పీఆర్సీ వంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 1999 నుండి 2004 మధ్య కాలంలో విద్యుత్ సంస్థల్లో నియమితులైన వారికి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలన్న విద్యుత్‌ ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని పేర్కొన్నారు.

Bandi Sanjay fires on cm KCR స్వరాష్ట్రం సాధించడానికి తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. ప్రభుత్వ పాలనలో విద్యుత్ శాఖ అత్యంత కీలకమైందని.. ఆర్టిజన్లు, విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి దిగితే మొత్తం రాష్ట్ర పాలనా యంత్రాంగమే కుప్పకూలుతుందని హెచ్చరించారు.

ప్రభుత్వ ఉద్యోగుల పట్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మొదటి నుంచి చిన్నచూపేనని.. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని వెల్లడించారు. కొత్త పీఆర్సీ గురించి ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని.. దేశంలోనే మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకొనే బీఆర్‌ఎస్‌ సర్కారు.. ఉద్యోగులు కోరుతున్న నగదు రహిత మెడికల్ పాలసీ అమలు చేయడానికి ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు.

ఉద్యోగుల పదవీ విరమణ సహా వారికి న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన ఇన్సెంటివ్లు, పీఆర్సీ, జీపీఎఫ్ వంటి సమస్యల విషయంలో ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు, ఆర్టిజన్లతో చర్చలు జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. వారి న్యాయమైన కోరికలు పరిష్కరించని పక్షంలో తెలంగాణ ఉద్యోగులు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని బండి సంజయ్‌ లేఖలో హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.