ETV Bharat / state

Bandi Sanjay Fire on Rahul Gandhi Tweet on PM Modi : '1400 మంది అమరవీరుల మరణానికి కారణం కాంగ్రెస్‌..'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2023, 5:30 PM IST

Bandi Sanjay React to Rahul Gandhi Tweet on PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌కు బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. 1400 మంది అమరవీరుల మరణానికి కారణమైన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు ప్రధానిని ప్రశ్నిస్తోందని బండి సంజయ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Bandi Sanjay Fire on Rahul Gandhi
Bandi Sanjay Fire on Rahul Gandhi Tweet on PM Modi

Bandi Sanjay React to Rahul Gandhi Tweet on PM Modi : తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడడం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమేనని రాహుల్‌ గాంధీ(Rahul Gandhi Tweet) చేసిన ట్వీట్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌(Bandi Sanjay) కౌంటర్‌ ఇచ్చారు. మీ స్క్రిప్ట్‌ రైటర్‌ను మార్చుకోండి పప్పుజీ అంటూ ఎక్స్‌(Twitter) వేదికగా హితవు పలికారు.

"తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోడీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే." - రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేత

  • తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోడీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే.#PMshouldApologisetoTelangana

    — Rahul Gandhi (@RahulGandhi) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

1400 మంది అమరవీరుల మరణానికి కారణమైన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రధానిని ప్రశ్నిస్తోందని బండి సంజయ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకే ఓటు-రెండు రాష్ట్రాలు అని తొలిసారి పిలుపునిచ్చింది దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయినని చెప్పి తెలిపారు. రాహుల్‌ గాంధీ ముత్తాత నుంచి ఇప్పటి వరకు అందరూ.. తెలంగాణను మోసం చేశారని ఆరోపించారు. వందలాది మంది అమరవీరుల మరణానికి కారణమైనందుకు నెహ్రూ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు.

Bandi Sanjay on Contesting Assembly Election : 'ఎన్నికలు వేర్వేరుగా వస్తే.. కరీంనగర్ అసెంబ్లీకి పోటీ చేస్తా'

"మీ స్క్రిప్ట్‌ రైటర్‌ను మార్చుకోండి పప్పుజీ. మీ ముత్తాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ తెలంగాణను మోసం చేసింది. వందలాది మంది అమరవీరుల మరణానికి కారణమైనందుకు మీ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పాలి?. జవహర్‌లాల్ నెహ్రూ - జెంటిల్‌మన్ ఒప్పందం పేరుతో తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేశారు. ఇందిరా గాంధీ - 1969లో కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా దాదాపు 369 మంది ప్రాణాలు కోల్పోయారు.1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన రోజు నుంచి తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని రాజీవ్ గాంధీ 1985లో హామీ ఇచ్చారు. 1400 మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని తెలిసి బిల్లును ప్రవేశపెట్టారు." - బండి సంజయ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

  • Change your script writer Pappu ji...

    Ironic that Congress party which is responsible for death of 1400 martyrs, is now shamelessly questioning Hon’ble PM Shri @narendramodi ji who only means good for Telangana.

    It was first Atal Bihari Vajpayee ji who gave a call for One Vote… https://t.co/qYlStkpWct

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

MLC Chairman Gutha Fires on BJP : కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మొద్దు: గుత్తా

Bandi Sanjay Tweet : జవహర్‌లాల్‌ నెహ్రూ-జెంటిల్‌మెన్‌ ఒప్పందం పేరుతో తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేశారని బండి సంజయ్‌ అన్నారు. 1969లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కారణంగా దాదాపు 369 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటైన రోజు నుంచి తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని 1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 1400 మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత రాబోయేది బీజేపీ ప్రభుత్వమని తెలిసి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారని బండి సంజయ్‌ ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు.

MP Nama Nageswara Rao on PM Modi Comments : 'ప్రత్యేక రాష్ట్రంతో తెలంగాణ ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి.. ఆ విషయంలో మేమే నెంబర్​వన్'

Minister KTR Fires on Modi Comments on Telangana : 'తెలంగాణపై పదే పదే అక్కసు ఎందుకు..' మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.