ETV Bharat / state

ఆపరేషన్ ముస్కాన్​: 25,298 మంది చిన్నారులు గుర్తింపు

author img

By

Published : Nov 4, 2020, 4:54 PM IST

ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్​లో మొత్తం 25,298 మంది చిన్నారులను గుర్తించామన్నారు. 7 రోజుల్లో 16,457 మంది పిల్లలను కాపాడామని వివరించారు. పేదరికం కారణంగా 70 శాతం మంది చిన్నారులు ఇళ్లు వదిలి బయట పని చేస్తున్నారని తెలిపారు.

ఆపరేషన్ ముస్కాన్​: 25,298 మంది చిన్నారులు గుర్తింపు
ఆపరేషన్ ముస్కాన్​: 25,298 మంది చిన్నారులు గుర్తింపు

ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా వీధిబాలలు, వివిధ ప్రాంతాల్లో కూలీ పనులు చేస్తున్న చిన్నారులను పోలీస్​శాఖ గుర్తించిందని ఆ రాష్ట్ర డీజీపి గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మొత్తం 25,298 మంది చిన్నారులను గుర్తించామన్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. జనవరి, జులై, అక్టోబర్ నెలలో ఆపరేషన్స్ నిర్వహించామన్న డీజీపీ.. 7 రోజుల్లో 16,457 మంది పిల్లలను కాపాడామన్నారు.

చిన్న పిల్లల చేత.. ‌పని చేయించుకోవడం చట్టరీత్యా‌ నేరమని గౌతం సవాంగ్ హెచ్చరించారు. పిల్లలు చదువుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. చిన్నపిల్లల భవిష్యత్ సమాజానికి అవసరమన్నారు. చిన్నారులను రెస్క్యూ చేసి వదిలేయడమే కాకుండా.. వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.

పేదరికం కారణంగా 70 శాతం, తల్లిదండ్రులు పట్డించుకోకపోవడం వల్ల 9 శాతం, వివిధ కారణాలతో 21 శాతం మంది చిన్నారులు ఇళ్లు వదిలి వచ్చి బయట‌ జీవిస్తున్నట్లు గుర్తించామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్​ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: "ఆపరేషన్ ముస్కాన్, స్మైల్​తో బాలకార్మికులకు విముక్తి"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.