ETV Bharat / state

ఏపీలో కొత్తగా 58 కరోనా కేసులు

author img

By

Published : May 3, 2020, 1:29 PM IST

ఆంధ్రప్రదేశ్​లో గడచిన 24 గంటల్లో 58 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ap-corona-cases-breaking
ఏపీలో కొత్తగా 58 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్​లో ప్రకటించింది. కొత్త కేసులతో కలిపి.. కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,583కు చేరిందని తెలిపింది. 488 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారని పేర్కొంది. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 1,062 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 6,534 నమూనాలు పరీక్షించగా... 58 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ap-corona-cases-breaking
ఏపీలో కొత్తగా 58 కరోనా కేసులు

జిల్లాల వారీగా కొత్త కేసులు

  • కర్నూలు జిల్లాలో 30 కరోనా పాజిటివ్‌ కేసులు
  • గుంటూరు జిల్లాలో 11 కేసులు
  • కృష్ణా జిల్లాలో 8 కేసులు
  • అనంతపురం జిల్లాలో 7 కేసులు
  • చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదు

ఇవీ చూడండి: కరోనాపై పోరుకు కృతజ్ఞతగా యోధులపై పూలవర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.