ETV Bharat / state

రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400 పైగా మరణాలు

author img

By

Published : Jul 17, 2020, 10:27 PM IST

Updated : Jul 17, 2020, 11:34 PM IST

another-1478-corona-positive-cases-in-the-state
రాష్ట్రంలో మరో 1478 కరోనా పాజిటివ్​ కేసులు

21:24 July 17

రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400 పైగా మరణాలు

రాష్ట్రంలో కొవిడ్‌ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. జిల్లాల్లోనూ కేసుల సంఖ్య అదుపులోకి వచ్చేలా లేదు. తాజాగా రాష్ట్రంలో 1478 మందికి కొవిడ్‌ సోకగా... అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 806 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య.. 42 వేల మార్కు దాటింది. 

తాజాగా వచ్చిన పాజిటివ్‌ కేసులతో కలిపి ఇప్పటి వరకు 42,496 మంది కరోనా బారిన పడ్డారు. శుక్రవారం 1,410 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 28,705 మంది వైరస్‌ బారి నుంచి బయటపడ్డారు. తాజాగా 7 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు 403 మంది మహమ్మారికి బలయ్యారు.

ఇదీ చూడండి : అడవిని జల్లెడ పడుతున్న పోలీసులు.. చిక్కని మావోయిస్టులు

Last Updated :Jul 17, 2020, 11:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.