ETV Bharat / state

ఏపీ పరిషత్ పోరు: ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతమిలా..

author img

By

Published : Apr 8, 2021, 11:08 AM IST

ap parishad elections
ఏపీ పరిషత్ పోరు: ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతమిలా..

ఆంధ్రప్రదేశ్​లో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకేే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పలు చోట్ల బారులు తీరగా.. మరికొన్ని ప్రాంతాల్లో పెద్దగా స్పందన లేదు. ఉదయం 9 గంటల సమయానికి పోలింగ్ 7.76 శాతంగా నమోదైంది.

ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల సమయానికి పోలింగ్ 7.76 శాతంగా నమోదైంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 9.58 శాతంగా నమోదు కాగా.. అత్యల్పంగా కడప జిల్లాలో 4.81 శాతంగా ఉంది.

  1. శ్రీకాకుళం 9.00
  2. విజయనగరం 9.01
  3. విశాఖ 8.83
  4. తూ.గో. 4.59
  5. ప.గో. 9.26
  6. కృష్ణా 9.22
  7. గుంటూరు 7.52
  8. ప్రకాశం 6.53
  9. నెల్లూరు 6.36
  10. కర్నూలు 9.58
  11. అనంతపురం 7.76
  12. కడప 4.81
  13. చిత్తూరు 8.46
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.