ETV Bharat / state

ఏపీ పరిషత్ పోరు: ఉదయం 11 గంటలకు పోలింగ్ శాతమిలా..

author img

By

Published : Apr 8, 2021, 12:17 PM IST

ఉదయం 11 గంటలకు పోలింగ్ శాతమిలా..
ఉదయం 11 గంటలకు పోలింగ్ శాతమిలా..

ఏపీవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. పలుచోట్ల ఓటర్లు బారులు తీరగా.. మరికొన్ని ప్రాంతాల్లో పెద్దగా స్పందన లేదు. ఉదయం 11 గంటల సమయానికి పోలింగ్ 21.65 శాతంగా నమోదైంది.

ఆంధ్రప్రదేశ్​లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి పోలింగ్ 21.65 శాతంగా నమోదైంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 25.96 శాతంగా నమోదు కాగా.. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 15.05 శాతంగా ఉంది.

  1. శ్రీకాకుళం 19.32
  2. విజయనగరం 25.68
  3. విశాఖ 24.14
  4. తూ.గో. 25.00
  5. ప.గో. 23.40
  6. కృష్ణా 19.29
  7. గుంటూరు 15.85
  8. ప్రకాశం 15.05
  9. నెల్లూరు 20.59
  10. కర్నూలు 25.96
  11. అనంతపురం 22.88
  12. కడప 19.72
  13. చిత్తూరు 24.52

ఇదీ చూడండి: బహిష్కరణలు, ఆందోళనలతో ఏపీలో పరిషత్​ ఎన్నికల పోలింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.