ETV Bharat / state

సైఫాబాద్ ఆంధ్రాబ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇక నుంచి యూబీఐ

author img

By

Published : Apr 2, 2020, 5:07 PM IST

దేశంలోని పది భారీ ప్రభుత్వ రంగ సంస్థల వీలనం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. సైఫాబాద్ ఆంధ్రాబ్యాంక్​ ప్రధాన కార్యాలయం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. ఆ ప్రకారమే కార్యాలయ బోర్డులో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఇక నుంచి ఆంధ్రబ్యాంకు ...యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇక నుంచి ఆంధ్రబ్యాంకు ...యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకుల భారీ విలీనం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఫలితంగా ఆంధ్రా బ్యాంక్ సహా ఆరు బ్యాంకులు కనుమరుగయ్యాయి. హైదరాబాద్ సైఫాబాద్​లోని ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయ బోర్డును... యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. దేశ వ్యాప్తంగా ఓ వైపు కొవిడ్‌-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్‌ డౌన్ అమలవుతోంది.

అంతర్జాతీయ స్థాయి పోటీ కోసమే...

మరో వైపు విలీన ప్రక్రియను ప్రణాళికబద్ధంగానే అమలు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలిగే భారీ బ్యాంకులను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే కేంద్రం ఈ చర్యలకు పూనుకుంది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ రంగంలో బ్యాంకుల విలీనానికి తెరతీసింది భారత సర్కారు. ప్రభుత్వ రంగంలో ఎస్‌బీఐ తర్వాత దేశంలోనే రెండో అతి పెద్ద బ్యాంకుగా పీఎన్‌బీ ఆవిర్భవించింది.

ఇవీ చూడండి : కరోనా పంజా: 12 గంటల్లో 9 మరణాలు, 131 కేసులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.