ETV Bharat / state

ఆ ఇంట్లో పురాతన నాణేలు... వెలికి తీసేందుకు పూజలు!

author img

By

Published : Sep 7, 2021, 2:15 PM IST

ఓ మహిళ ఇంట్లో 16 పురాతన నాణేలు దొరికాయి. వీటిని వెలికి తీయడానికి మహిళ ఇంట్లో కొందరు పూజలు చేసినట్లు అధికారులు గుర్తించారు. నాణేలు స్వాధీనం చేసుకుని... పురావస్తు శాఖ అధికారులకు ఇస్తామని వెల్లడించారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

Ancient coins
పురాతన నాణేలు

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు నగరంలోని నీవా నది ఒడ్డున ఉన్న వీరభద్ర కాలనీలో ఓ మహిళ ఇంట్లో 16 పురాతన నాణేలు దొరికాయి. వాటిని చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నాణేలను పురావస్తుశాఖ అధికారులకు అప్పగించి విచారణ జరిపిస్తామని చిత్తూరు తహసీల్దార్ సుబ్రమణ్యం తెలిపారు.

నాణేలకు బంగారు పూత పూసి ఉందని.. ఈ నాణేలను వెలికి తీయడానికి మహిళ ఇంట్లో కొందరు పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పూజలు నాణేల కోసమే చేశారా? లేక ఎక్కడివైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తామన్నారు.

ఇదీ చదవండి: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.