ETV Bharat / state

ఏపీ సీఎం జగన్​ వ్యాఖ్యలపై అమరావతి రైతుల ఆగ్రహం

author img

By

Published : Jan 31, 2023, 7:48 PM IST

Amaravati Farmers
Amaravati Farmers

Amaravati Farmers : ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్​ ఇలా వ్యాఖ్యానించటం సరైంది కాదని స్పష్టం చేశారు. జగన్​మోహన్​ రెడ్డి మోసపు మాటలను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరన్నారు.

Amaravati Farmers Fires on Cm Jagan Comments: దిల్లీలో ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి విశాఖ రాజధానిపై చేసిన వ్యాఖ్యలపై అమరావతి రైతులు మండిపడ్డారు. రాజధానిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా.. ముఖ్యమంత్రి ఇలా ప్రకటించటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఇంతవరకు కౌలు చెల్లించకపోవటాన్ని తప్పుబట్టారు. రాజధానిలో దళితులు రోడ్డున పడి ఏడుస్తుంటే.. సీఏం పట్టించుకోరా అని ప్రశ్నించారు. జగన్ మోసపు​ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు.

ఇదీ జరిగింది : దిల్లీలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు వేదికపై.. ఏపీ రాష్ట్ర రాజధాని త్వరలోనే విశాఖకు తరలివెళ్తుందని ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి ప్రకటించారు. తాను కూడా విశాఖకు మకాం మారుస్తానని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. మరోసారి విశాఖలో కలవాలనుకుంటున్నానని.. అందుకు మిమ్మల్ని విశాఖకు ఆహ్వానిస్తున్నానని, వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం అన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.