ETV Bharat / state

'పరిషత్ ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి'

author img

By

Published : May 21, 2021, 12:51 PM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించినట్లు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు.

advocate-narra-on-parishad-elections-abolish
'పరిషత్ ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి'

ఆంధ్రప్రదేశ్​ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించినట్లు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ తెలిపారు. మళ్లీ నోటిఫికేషన్‌ అంటే అన్నీ రద్దయ్యే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఎన్నికలు మొదటినుంచి జరపాలని హైకోర్టు ఆదేశించినా.. ఎన్నికల నిబంధనలు సరిగా అమలు చేయలేదని ఆరోపించారు.

' ఎస్‌ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి'

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పరిషత్​ ఎన్నికలు జరగలేదని హైకోర్టు స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఏకగ్రీవాలపై ఎస్​ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు.

ఇదీచదవండి: ఏపీలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.