ETV Bharat / state

నిజాం కళాశాల వద్ద ఏబీవీపీ ఆందోళన... నేతల అరెస్ట్

author img

By

Published : May 2, 2019, 12:48 PM IST

నిజాం కళాశాల వద్ద ఏబీవీపీ ఆందోళన.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఇంటర్​బోర్డు తీరును నిరసిస్తూ... ఏబీవీపీ నాయకులు నిజాం కళాశాల ఎదుట ధర్నా చేపట్టగా.. పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని అబిడ్స్ పీఎస్​కు తరలించారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను అదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇంటర్​ ఫలితాల విషయంలో రాష్ట్రంలో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంటర్‌బోర్డు తీరును నిరసిస్తూ నిజాం కళాశాల ఎదుట ఏబీవీపీ విద్యార్థి సంఘం ధర్నాకు దిగింది. కళాశాల ఎదుట శ్రేణులు ఆందోళన చేపట్టగా... పోలీసులు అడ్డుకున్నారు. ఏబీవీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం తలెత్తింది. వారిని అదుపులోకి తీసుకుని అబిడ్స్‌ పీఎస్‌కు తరలించారు. ఇంటర్ బోర్డ్‌లో అవకతవకలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

నిజాం కళాశాల వద్ద ఏబీవీపీ ఆందోళన..
Intro:ఇంటర్ విద్యార్థుల కు న్యాయం జరిగే వరకు బీజేవైఎం పోరాటం కొనసాగిస్తుందని నాయకుడు స్పష్టం చేశారు


Body:ఇంటర్ అవకతవకలపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నగర బీజేవైఎం ఆందోళన చేపట్టింది.... ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా చిన్న పిలుపులో భాగంగా బీజేవైఎం గ్రేటర్ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో రాస్తారోకో నిర్వహించారు..... ఆర్టీసీ బస్సులకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు...... ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు.... ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేసేవరకు దశల వారీగా తమ పోరాటం కొనసాగిస్తామని బీజేవైఎం గ్రేటర్ అధ్యక్షుడు నవీన్ స్పష్టం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన హితవు పలికారు......


Conclusion:ఆర్టీసీ క్రాస్ రోడ్లో విజయనగరం నాయకులు చేపట్టిన రాస్తారోకోతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.