ETV Bharat / state

అరేబియా సముద్రంలో ఏపీ మత్సకారుడు గల్లంతు

author img

By

Published : Mar 17, 2020, 7:09 PM IST

సముద్రంలో మత్సకారుడు గల్లంతు
సముద్రంలో మత్సకారుడు గల్లంతు

కర్నాటక మంగళూరు సమీపంలోని అరేబియా సముద్రంలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన మత్స్యకారుడు బర్రి లక్ష్మణ్​​రావు గల్లంతయ్యాడు. ఆచూకీ కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మత్స్యకారుడు అరేబియా సముద్రంలో గల్లంతయ్యాడు. కర్నాటక రాష్ట్రం మంగళూరు వద్ద సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బర్రి లక్ష్మణ్‌రావు అనంతరం గల్లంతయ్యాడు. ఆదివారం రాత్రి వేట ముగించుకుని.. పడవలోనే నిద్రకు ఉపక్రమించాడు. ఉదయానికల్లా కనిపించకుండా పోయాడు. తోటి మత్స్యకారులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మంగళూరు పోలీసులు.. లక్ష్మణ్‌రావు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఇవీ చూడండి : ముగ్గురు పిల్లలపై సవతితల్లి అరాచకత్వం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.