ETV Bharat / state

ఏపీలో కొత్తగా 54 కొవిడ్​ పాజిటివ్​ కేసులు

author img

By

Published : Feb 13, 2021, 10:59 PM IST

ఏపీలో కొత్తగా 54 మంది కరోనా బారినపడ్డట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నూతనంగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య 8,88,814కు చేరింది.

ఏపీలో కొత్తగా 54 కొవిడ్​ పాజిటివ్​ కేసులు
ఏపీలో కొత్తగా 54 కొవిడ్​ పాజిటివ్​ కేసులు

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 54 మందికి కొవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ బారినపడ్డ వారి సంఖ్య 8,88,814కు చేరిందని వెల్లడించింది.

ఏపీలో ప్రస్తుతం 797 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ఎవరూ మృతి చెందలేదని తెలిపిన వైద్యారోగ్యశాఖ.. మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 7,162 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

గడిచిన 24 గంటల్లో మరో 71 మంది కొవిడ్​ నుంచి కోలుకోగా.. మెుత్తం కోలుకున్నవారి సంఖ్య 8,80,855కు చేరింది. ఇప్పటి వరకూ 1,35,17,440 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 54 కొవిడ్​ పాజిటివ్​ కేసులు
ఏపీలో కొత్తగా 54 కొవిడ్​ పాజిటివ్​ కేసులు

ఇదీ చూడండి: 'జై జంగో జై లింగో' దీక్ష విరమించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.