ETV Bharat / state

రాష్ట్రంలో మరో 3,840 కరోనా కేసులు, 9 మరణాలు

author img

By

Published : Apr 16, 2021, 9:09 AM IST

Updated : Apr 16, 2021, 10:21 AM IST

covid cases in telangana
tg cases

09:07 April 16

రాష్ట్రంలో మరో 3,840 కరోనా కేసులు, 9 మరణాలు

రాష్ట్రంలో మరో 3,840 కరోనా కేసులు, 9 మరణాలు
రాష్ట్రంలో మరో 3,840 కరోనా కేసులు, 9 మరణాలు

 తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మొదటి సారిగా రాష్ట్రంలో ఇవాళ 3,840 పాజిటివ్‌ కేసులు, 9 మరణాలు సంభవించాయి. మరో 5,095మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు. నిన్న రాత్రి 8గంటల వరకు 1,21,880 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు... ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. 

  కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,797కి చేరింది. రాష్ట్రంలో 0.52శాతం మంది కరోనా రోగులు మృతి చెందుతున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కరోనా బారి నుంచి నిన్న 1198 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,09,594కి చేరింది. ప్రస్తుతం 30,494 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 20,215 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 505 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు

 ఆదిలాబాద్​లో 85, భద్రాద్రి కొత్తగూడెం 54, జగిత్యాల 167, జనగామ 48, జయశంకర్ భూపాలపల్లి 16, జోగులాంబ గద్వాల 26, కామారెడ్డి 144, కరీంనగర్ 124, ఖమ్మం 111, కొమరంభీం ఆసిఫాబాద్ 23, మహబూబ్ నగర్ 124, మహబూబాబాద్ 24, మంచిర్యాల 101, మెదక్ 64, మేడ్చల్ మల్కాజ్ గిరి 407, ములుగు 14, నాగర్ కర్నూల్ 60, నల్గొండ 116, నారాయణ పేట 18, నిర్మల్ 159, నిజామాబాద్ 303, పెద్దపల్లి 66, రాజన్న సిరిసిల్ల 88, రంగారెడ్డి 302, సంగారెడ్డి 175, సిద్దిపేట 86, సూర్యాపేట 57, వికారాబాద్ 69, వనపర్తి 75, వరంగల్ రూరల్ 45, వరంగల్ అర్బన్ 114, యాదాద్రి భువనగిరి 70మందికి కరోనా సోకింది.

ఇదీ చూడండి: అబ్బే టీకాలు అందుబాటులో లేవు.. మూడురోజులుగా ఇదే స్థితి!

Last Updated : Apr 16, 2021, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.