ETV Bharat / state

వీడియో కాన్ఫరెన్స్​లో బూతుచిత్రం

author img

By

Published : Jun 5, 2019, 12:04 PM IST

Updated : Jun 5, 2019, 1:42 PM IST

వీడియో కాన్ఫరెన్స్​లో బూతుచిత్రం

అధికారులంతా సమీక్షలో మునిగిపోయారు. పౌరసరఫరాల కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అందరూ తలమునకలై ఉండగా ఇంతలో తెరపై నీలిచిత్రం దర్శనమిచ్చింది. ఆ దృశ్యాన్ని చూసి అంతా షాకయ్యారు.

రాజస్థాన్‌ సచివాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆ శాఖ కార్యదర్శి ముగ్ధాసింగ్ వీడియో కాన్ఫనెన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో దాదాపు 10 మంది ఉన్నతాధికారులు, 33 జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుండగా..తెరపై బూతుచిత్రం దర్శనమిచ్చింది. ఈ దృశ్యాన్ని చూసి అధికారులంతా తెల్లమొహాలు వేశారు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పౌరసరఫరాల కార్యదర్శి ముగ్ధాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఆమె ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Intro:Body:Conclusion:
Last Updated :Jun 5, 2019, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.