భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో నిర్వహిస్తున్న 67వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు రెండవరోజు ఉత్సాహంగా కొనసాగాయి. 33 జిల్లాల నుంచి వచ్చిన మహిళ, పురుష క్రీడాకారులకు రెండవ రోజు జిల్లాల వారీగా క్రీడలు నిర్వహించారు. ఆటగాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇల్లందు పట్టణంలో నిర్వహిస్తున్న క్రీడల పట్ల క్రీడాకారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:బిడ్డకు కిడ్నీ ఇచ్చేందుకు తల్లి అంగీకారం.. కానీ చట్టం..!