ETV Bharat / state

వీహెచ్​ను అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై బైఠాయింపు

author img

By

Published : Jun 13, 2020, 6:17 AM IST

Police blocking the VH hanumantha rao at kothagudem
వీహెచ్​ను అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై బైఠాయింపు

దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద జల దీక్ష చేపట్టేందుకు వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావును కొత్తగూడెంలోని సింగరేణి విశ్రాంతి గృహం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే రోడ్డుపై బైఠాయించి వర్షంలో నిరసన తెలిపారు.

దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టేందుకు వెళ్తున్న వి.హనుమంత రావును కొత్తగూడెం పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా హనుమంతరావు రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షం కురుస్తుండగా ఆ జల్లులోనే తన నిరసనను వ్యక్తం చేస్తూ రోడ్డుపై కూర్చున్నారు. తెరాస ప్రభుత్వం పోలీసులను ప్రలోభపెట్టి వారిని ఉపయోగించి తమ పబ్బం గడుపుకుందని హనుమంతరావు ఆరోపించారు. జల దీక్షకు అనుమతి లేకపోవడం వల్ల కాంగ్రెస్ నాయకులను పలుచోట్ల పోలీసులు ఆపుతున్నారు.

ఇదీ చూడండి : 'గాంధీలో జరుగుతున్న చికిత్సపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.