ETV Bharat / state

కనిష్ట స్థాయికి తగ్గిపోయిన గోదావరి నీటిమట్టం

author img

By

Published : Mar 4, 2021, 5:23 AM IST

ఎండాకాలం మొదలు కాకముందే గోదావరి నీటిమట్టం కనిష్ట స్థాయిలోకి తగ్గిపోయింది. జీవనదిగా పేరుగాంచిన గోదావరి నీటిమట్టం కనిష్ట స్థాయిలో తగ్గిపోవడంతో క్రమంగా గోదావరి నది ఎండిపోతూ వస్తోంది. అప్పుడే ఎండలు మండుతుండడం వల్ల భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద బుధవారం నీటిమట్టం కనిష్టంగా రెండు అడుగులకు పడిపోయింది.

Godavari water level drops to minimum at bhadrachalam
కనిష్ట స్థాయికి తగ్గిపోయిన గోదావరి నీటిమట్టం

ఎండాకాలం ప్రారంభంలోనే గోదావరి నీటిమట్టం కనిష్ట స్థాయిలో తగ్గిపోతోంది. ఎండ తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద బుధవారం నీటిమట్టం కనిష్టంగా రెండు అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద మార్చిలో గోదావరిలో ఇంత తక్కువగా నీరు ఉండటం... ఇదే మొదటిసారి అని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు.

గోదావరి నదిపై భద్రాచలం ఎగువన అనేక ప్రాజెక్టులు కట్టడంతోపాటు, యథేచ్చగా ఇసుకు తవ్వకాలు జరగడం వల్ల... భూగర్భజలాలు పడిపోతున్నాయని, నీటిమట్టం తగ్గుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా ఎండలు పెరిగితే... భద్రాచలం ప్రజలకు తాగునీరు దొరకడం కష్టమని ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి : చర్లపల్లికి యాదాద్రి ఆలయ వెండి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.