ETV Bharat / state

'రైతు వేదికలను శుభకార్యాలకు అద్దెకు ఇవ్వొచ్చు'

author img

By

Published : Apr 20, 2021, 12:59 PM IST

mla haripriya opening rythu vedika
రైతు వేదిక ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఎమ్మెల్యే హరిప్రియ రైతు వేదికలను ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యే హరిప్రియ రైతు వేదికలను ప్రారంభించి.. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. జిల్లాలోని ఇల్లందు మండలం కొమరారం రేపల్లె వాడలో నిర్మించిన రైతు వేదికలను ఆమె ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా.. రైతులకు వ్యవసాయ రంగంపై సందేహాలు తీర్చేలా రైతు వేదికలు రూపొందాయని ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. వీటి నిర్వహణ కోసం స్థానికులకు శుభకార్యాలకు అద్దెకు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.

ఇదీ చదవండి: 'కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.