ETV Bharat / state

నాగోబా ఆలయం హుండీ లెక్కింపు.. ఆదాయం రూ. 4,68,277

author img

By

Published : Feb 20, 2021, 10:54 PM IST

nagoba jathara was end
నాగోబా ఆలయం హుండీ లెక్కింపు

ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతర ముగిసింది. గత వారం రోజులుగా కొనసాగిన నాగోబా జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలొచ్చారు. నాగోబా ఆలయం హుండీ లెక్కింపు ఈ రోజు చేపట్టారు.

ఆదిలాబాద్​ జిల్లాలోని ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతర ముగిసింది. గత వారం రోజులుగా కొనసాగిన నాగోబా జాతరకు వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలొచ్చారు. నాగోబా ఆలయం హుండీ లెక్కింపు ఈ రోజు చేపట్టారు.

భక్తులు సమర్పించిన కానుకలను దేవాదాయశాఖ ఈవో ఆధ్వర్యంలో లెక్కించారు. ఆలయ ఆదాయం 4,68,277 రూపాయలు నగదు రాగా, 610 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ ఈవో, మిశ్రం వంశస్థులు తెలిపారు.

ఇదీ చదవండి: 'సచివాలయం' రాళ్ల కోసం రాజస్థాన్​కు తెలంగాణ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.