జీవో నెంబర్ 3ను రద్దు చేయాలా.. వద్దా.. అని నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో నెంబర్ 3తో అధికంగా ఉద్యోగాలు పొందింది లంబాడీలే అని ఎంపీ పేర్కొన్నారు. ఎస్టీ జాబితాలో చేర్చిన లంబాడీలను తొలగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) డిమాండ్ చేస్తుందని తెలిపారు. జీవో నెంబర్ 3ను రద్దు చేస్తే నష్టపోతామని భావించిన లంబాడీలు.. ఆదివాసులతో కలిసి ఉద్యమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. జీవో నెంబర్ 3ను రద్దు చేయాలంటున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆలోచించాలని ఆయన అన్నారు.
ఇదీ చూడండి: క్వారంటైన్లో కూలీల శ్రమదానం- బడికి కొత్తరూపం