ETV Bharat / sports

అట్టహాసంగా పారాలింపిక్స్​ ప్రారంభోత్సవ వేడుక

author img

By

Published : Aug 24, 2021, 5:33 PM IST

Updated : Aug 24, 2021, 7:38 PM IST

టోక్యో పారాలింపిక్స్ (Tokyo Para Olympics) ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆరంభ వేడుకల్లో (Tokyo Para Olympics opening ceremony) జావెలిన్​ త్రోవర్​ టెక్​ చంద్​(Athlete Tek Chand) తివర్ణ పతాకం చేతబూని జట్టును ముందుకు నడిపించాడు.

Para Olympics
పారాలింపిక్స్

టోక్యో ఒలింపిక్స్‌ సంబరాల్లో మునిగి తేలాక రెండు వారాలు విరామం తీసుకున్న క్రీడాభిమానుల కోసం ఇంకో ఆటల పండుగ వచ్చేసింది. టోక్యోలో మరో విశ్వ క్రీడాసంబంరం మొదలైంది. 16వ పారాలింపిక్స్‌ వేడుకలు(Tokyo Para Olympics opening ceremony) టోక్యో ప్రధాన స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి.

కనులపండుగగా భారత జట్టు

ఆరంభ వేడుకల్లో భారత జట్టును ముందుండి నడిపించాడు జావెలిన్ త్రోవర్ టెక్ చంద్. విశ్వక్రీడా వేదికపై మువ్వన్నెల జెండాను చూసి ప్రేక్షకులు మురిసిపోయారు.

వైకల్యం శరీరానికే కాని.. తమ సంకల్పానికి కాదని చాటుతూ ప్రపంచం నలుమూలల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు తమ సత్తా చాటడానికి టోక్యోలో సిద్ధంగా ఉన్నారు. అందులో భారత యోధులు 54 మంది. పారాలింపిక్స్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంత పెద్ద జట్టుతో, భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న భారత బృందం.. రెండంకెల సంఖ్యలో పతకాలను లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవీ చూడండి: TOKYO PARALYMPICS 2020: టోక్యో పారాలింపిక్స్​లో భారత నారీమణులు..

Last Updated :Aug 24, 2021, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.