ETV Bharat / sports

Tokyo Paralympics: పతక విజేతలకు ఘనస్వాగతం.. సత్కారం

author img

By

Published : Sep 3, 2021, 6:43 PM IST

Sports Minister Anurag Thakur felicitates para athletes
Tokyo Paralympics: పతక విజేతలకు ఘనస్వాగతం.. సత్కారం

పారాలింపిక్స్​లో(Tokyo Paralympics) పతకాలు సాధించిన నలుగురు అథ్లెట్లకు దిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. స్వర్ణ పతక విజేత సుమిత్​ అంటిల్​తో(Sumit Antil) పాటు మరో ముగ్గురు మెడలిస్టులకు సాయ్​ అధికారులు పూలమాలలతో సత్కరించారు. ఆ నలుగురు పతక విజేతలను క్రీడాశాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​(Anurag Thakur) ప్రత్యేకంగా సత్కరించారు.

టోక్యో పారాలింపిక్స్​లో(Tokyo Paralympics) పాల్గొన్న భారత అథ్లెట్లకు దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం ఘనస్వాగతం లభించింది. పతకాలు సాధించిన నలుగురు క్రీడాకారులను చూసేందుకు ఎయిర్​పోర్ట్​ వద్దకు పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు. ముఖ్యంగా జావెలిన్​ త్రోలో స్వర్ణ పతకం సాధించిన సుమిత్​ అంటిల్​(Sumit Antil) కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. దిల్లీ చేరుకున్న వారిలో సుమిత్​తో పాటు రజత పతక విజేతలు దేవేంద్ర ఝజారియా(Devendra Jhajharia Javelin Throw), యోగేశ్​ కథునియా(డిస్కస్​ త్రో).. కాంస్య పతక విజేత శరద్​ కుమార్​(హైజంప్​) ఉన్నారు.

ఆ నలుగురు అథ్లెట్లకు సాయ్​(SAI) అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. క్రీడాకారులకు పూలమాలలు, పుష్పగుచ్ఛాలు అందించారు. అథ్లెట్లు తమ పతకాలతో ఫొటోలకు పోజులిస్తుండగా.. అభిమానులు త్రివర్ణ పతాకాలను చూపిస్తూ క్రీడాకారులను అభినందించారు.

బ్యాట్​కు పోటీగా ఈటె..

భారత్​లో క్రికెట్​ బ్యాట్​కు పోటీగా జావెలిన్​ త్రో ఈటెకు పాపులారిటీ పెరుగుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​(Anurag Thakur) జోస్యం చెప్పారు. పారాలింపిక్స్​లో పతకాలు సాధించి.. స్వదేశానికి చేరుకున్న అథ్లెట్లను శుక్రవారం ఆయన మాట్లాడారు. అనంతరం గోల్డ్​ మెడలిస్ట్​ సుమిత్​తో పాటు రజత పతక విజేతలు దేవేంద్ర ఝజారియా(జావెలిన్​ త్రో), యోగేశ్​ కథునియా(Yogesh Kathuniya Paralympics).. కాంస్య పతక విజేత శరద్​ కుమార్​(Sundar Singh Gurjar Javelin Throw​)లను అనురాగ్​ సత్కరించారు.

ఇదీ చూడండి.. పారాలింపిక్స్​లో భారత్​కు పతకాల పంట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.