ETV Bharat / sports

పతకం తెచ్చినందుకు.. రూ. 4 కోట్ల నజరానా, ప్రభుత్వ ఉద్యోగం

author img

By

Published : Aug 5, 2021, 5:54 PM IST

Slug ravikumar dahiya haryana govt news
రవికుమార్ దహియా

ఒలింపిక్స్ రజత పతక విజేత రవికుమార్​ దహియాకు ప్రోత్సాహకం ప్రకటించింది హరియాణా ప్రభుత్వం. అతడికి భారీ నజరానాతో పాటు ఉద్యోగం, భూమి ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

భారత యువరెజ్లర్ రవి కుమార్​ దహియా.. టోక్యో ఒలింపిక్స్​లో రజతం గెలిచి, మన మువ్వన్నెల పతకాన్ని రెపరెపలాడించాడు. దీంతో హరియాణా ప్రభుత్వం అతడిపై వరాల జల్లు కురిపించింది.

ravikumar dahiya
రవికుమార్ దహియా

ఒలింపిక్స్​ పతక విజేత రవి కుమార్ దహియాకు క్లాస్​-1 కేటగిరీ ఉద్యోగం, రాష్ట్రంలో ఎక్కడ కావాలంటే అక్కడ ప్లాట్​ భూమి 50 శాతం రాయితీతో అందిస్తామని హరియాణా ప్రభుత్వం వెల్లడించింది. అతడి స్వస్థలం నాహ్రీలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చింది. అలానే ముందే ప్రకటించినట్లు రజతం గెలిచినందుకు రూ.4 కోట్లు నజరానా ఇవ్వనున్నట్లు హరియాణా ప్రభుత్వం స్పష్టం చేసింది.

23 ఏళ్ల రవికుమార్​ దహియాకు ఇదే తొలి ఒలింపిక్స్. 57 కిలోల విభాగంలో పోటీపడిన అతడు.. ఫైనల్​లో ఆర్​ఓసీ(రష్యా ఒలింపిక్ కమిటీ) ప్లేయర్ ఉగెవ్‌ జవుర్‌ చేతిలో 4-7 తేడాతో ఓడిపోయాడు.

ఇది చదవండి: Olympics: భారత్​కు మరో పతకం.. రెజ్లర్​ రవి దహియాకు రజతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.