ETV Bharat / sports

T20 world cup 2021: సెమీస్​కు పాక్- నమీబియాపై ఘన విజయం

author img

By

Published : Nov 2, 2021, 11:14 PM IST

t20 world cup 2021
టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) పాకిస్థాన్​ దూకుడు కొనసాగుతోంది. మంగళవారం నమీబియాపై(Pak Vs Nam) 45 పరుగుల తేడాతో గెలిచింది. ఓపెనర్లు బాబార్ అజామ్, రిజ్వాన్ అర్ధ శతకాలతో చెలరేగిపోయారు.

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్​లోనూ (Pak Vs Nam) పాకిస్థాన్​ అదరగొట్టింది. బ్యాటర్లు, బౌలర్లు మరోసారి అద్భుత ప్రదర్శన చేసిన వేళ వరుసగా నాలుగో విజయం కైవసం చేసుకొని సెమీస్​లోకి అధికారికంగా అడుగుపెట్టింది. పాక్​ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో నమీబియా తడబడింది. క్రెయిగ్ విలియమ్స్​(40) రాణించాడు. దీంతో ఆ జట్టుపై 45 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది పాక్. పాక్​ బౌలర్లలో హసన్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్ తలో వికెట్.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్​ చేసిన పాక్​.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఓపెనర్లు (Babar Azam News) బాబర్ అజామ్(70), రిజ్వాన్​(79) మరోసారి అదరగొట్టారు. హఫీజ్(32) ఫర్వాలేదనిపించాడు. నమీబియా బౌలర్లలో వైస్, జేన్ తలో వికెట్ తీశారు.

ఇదీ చూడండి: బంగ్లాదేశ్​పై దక్షిణాఫ్రికా గెలుపు.. సెమీస్​ అవకాశాలు మెరుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.