దక్షిణ జపాన్ ప్రాంతానికి చేరిన ఒలింపిక్స్ జ్యోతిని వీక్షించేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. చిన్నా పెద్దా లేకుండా కరోనా నిబంధనలను పక్కన పెట్టి రోడ్లపైకి వచ్చారు. ఆ టార్చ్ ముందు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.
![Thousands of people flocked to take Selfies with the Olympic flame in northeastern Japan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6505428_tokyo800.jpg)
![Thousands of people flocked to take Selfies with the Olympic flame in northeastern Japan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6505428_tokyo200000.jpg)
వేలమంది గంటల తరబడి
జపాన్ మియాగి ప్రాంతంలోని సెండాయ్ స్టేషన్లో ఈ జ్యోతిని సందర్శనార్ధం ఉంచారు. ఈ ఆహ్వాన కార్యక్రమానికి దాదాపు 50వేల మంది హాజరయ్యారు. టార్చ్ను ప్రత్యక్షంగా చూసేందుకు గంటల పాటు అరకిలోమీటర్ దూరం క్యూలో జనం నిల్చున్నారు.
![Thousands of people flocked to take Selfies with the Olympic flame in northeastern Japan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6505428_olympic2020.jpg)
26 నుంచి యాత్ర
ఒలింపిక్ టార్చ్ రిలే మార్చి 26న ఫుకుషిమాలో ఆరంభమవుతుంది. అయితే కరోనా భయపెడుతున్న నేపథ్యంలో నాలుగు నెలల జ్యోతి యాత్రలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. యాత్ర జరిగే మార్గాల్లో ఎక్కువగా వీధుల్లోకి రావొద్దని నిర్వాహకులు ఇప్పటికే కోరారు.
జులై 24న ప్రారంభమవ్వాల్సిన టోక్యో ఒలింపిక్స్పై ఇప్పటికీ సందిగ్ధం నెలకొంది. చాలా మంది క్రీడాకారులు ఈ మెగాటోర్నీని వాయిదా వేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై టోక్యో ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమచారం. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.