ETV Bharat / sports

2020 రౌండప్: లోకాన్ని విడిచి.. మదిలో నిలిచి!

author img

By

Published : Dec 26, 2020, 2:22 PM IST

Remembering the sporting legends who passed away in 2020
క్రీడా లోకాన్ని విడిచి.. అభిమానుల మదిలో నిలిచి!

ఈ ఏడాది మనకు చాలా చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. దివికెగిసిన ఎందరో ప్రముఖ క్రీడాకారులు, మాజీలు.. తమ అభిమానుల్ని శోకసంద్రంలో ముంచారు. ఇంతకీ వారెవరు అనేది ఈ స్టోరీ.

2020 అంటే కరోనా, లాక్​డౌన్​తో పాటు చాలా సంఘటనలు మనల్ని కుదిపేశాయి. ఎందరో ప్రముఖ క్రీడాకారులు కూడా ఇదే ఏడాది తుదిశ్వాస విడిచి శోకాన్ని మిగిల్చారు. ఇంతకీ వారెవరు? ఎప్పుడు మరణించారు? అనేదే ఈ కథనం.

కోబ్​ బ్రయంట్​ -బాస్కెట్​ బాల్​ ప్లేయర్ (1978-2020)

నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) లెజెండ్ కోబ్ బ్రయంట్.. జనవరి 26న హెలికాఫ్టర్​ ప్రమాదంలో మృతి చెందాడు. కాలిఫోర్నియాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కోబ్​తో పాటు అతని 13 ఏళ్ల కుమార్తె జియాన్నా, మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుసార్లు ఎన్‌బీఏ ఛాంపియన్‌గా నిలిచిన బ్రయంట్.. రెండుసార్లు(2008, 2012) ఒలింపిక్‌ స్వర్ణాన్ని గెల్చుకున్నాడు.

Remembering the sporting legends who passed away in 2020
కోబ్​ బ్రయంట్

బల్బీర్​ సింగ్​ - హాకీ ఆటగాడు (1923-2020)

అనారోగ్య సమస్యలతో భారత హాకీ దిగ్గజం​ బల్బీర్ సింగ్​.. ఈ ఏడాది మే 8న మొహాలీలో చికిత్స పొందుతూ, అదే నెల 25న మరణించారు. ఒలింపిక్స్​ పురుషుల హాకీ ఫైనల్లో అత్యధిక గోల్స్​ చేసిన ఆటగాడిగా బల్బీర్ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. హకీ జట్టు కెప్టెన్​గా మూడు ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు అందుకున్నారు.

Remembering the sporting legends who passed away in 2020
బల్బీర్​ సింగ్​
Remembering the sporting legends who passed away in 2020
హాకీ దిగ్గజం బల్బీర్​ సింగ్​ సాధించిన ఒలింపిక్స్​ మెడల్స్​

రాజిందర్​ గోయల్​ - క్రికెటర్ (1942-2020)

ఫస్ట్‌క్లాస్‌ స్పిన్నర్‌ రాజిందర్‌ గోయల్‌ (77) జూన్​ 21న మరణించారు. వయసురీత్యా అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారు. దేశవాళీలో మ్యాచ్‌ రిఫరీగానూ పనిచేశారు. ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ 157 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 750 వికెట్లు తీశారు. ఈ ఫార్మాట్​లో ఎక్కువ వికెట్లు తీసిన ఘనత ఈయనకే సొంతం.

Remembering the sporting legends who passed away in 2020
రాజిందర్​ గోయల్​

చేతన్ చౌహాన్​ - క్రికెటర్ (1947-2020)

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ అనారోగ్య సమస్యలతో ఆగస్టు 16న​ కన్నుమూశారు. కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరిన చేతన్​​.. వైరస్​ నుంచి కోలుకున్న తర్వాత అనారోగ్యం కారణంగా మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించారు.

Remembering the sporting legends who passed away in 2020
చేతన్ చౌహాన్​

డీన్​ జోన్స్​ - క్రికెటర్ (1961-2020)

ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్(59) గుండెపోటుతో సెప్టెంబరు 24న మరణించారు. ఐపీఎల్ 13వ సీజన్​లో వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి భారత్​ వచ్చిన ఈయన, ముంబయిలోని ఓ హోటల్​లో తుదిశ్వాస విడిచారు.

Remembering the sporting legends who passed away in 2020
డీన్​జోన్స్​

చునీ గోస్వామి - ఫుట్​బాలర్ (1938-2020)

భారత దిగ్గజ ఫుట్​బాలర్​ చునీ గోస్వామి.. ఈ ఏడాది ఏప్రిల్​ 30న కోల్​కతాలో కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఈయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Remembering the sporting legends who passed away in 2020
చునీ గోస్వామి
Remembering the sporting legends who passed away in 2020
చునీ గోస్వామి (పాత చిత్రం)

డిగో మారడోనా - ఫుట్​బాలర్ (1960-2020)

Remembering the sporting legends who passed away in 2020
డీగో మారడోనా

నవంబరు రెండో వారంలో మెదడు శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన మారడోనా.. రెండు వారాల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ఆ తర్వాత నవంబరు 25న గుండెపోటుతో కన్నుమూసి తన అభిమానులను శోకసంద్రంలో ముంచారు.

పాలో రోసీ (ఫుట్​బాల్​)- (1956-2020)

ఇటలీ దిగ్గజ ఫుట్​బాలర్ పాలోరోసీ(64) డిసెంబరు 9న కన్నుమూశాడు. దిగ్గజ మారడోనా మరణించిన కొద్దిరోజులకే రాసీ మృతి చెందడం ఫుట్‌బాల్‌ అభిమానులను కలచివేసింది.

Remembering the sporting legends who passed away in 2020
పాలో రోసీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.