ETV Bharat / sports

Tokyo Paralympics: భారత్​కు పతకం- కలెక్టర్ల ఇంట్లో సంబరాలు

author img

By

Published : Sep 5, 2021, 11:51 AM IST

Suhas Yathiraj clinches silver in badminton SL4 class
భారత్​కు పతకం- కలెక్టర్ల ఇంట్లో సంబరాలు

యతిరాజ్ సుహాస్.. పారాలింపిక్స్​లో రజతం గెలిచి అరుదైన ఘనత సాధించారు. ఈ టోర్నీలో పాల్గొని పతకం గెలిచిన తొలి కలెక్టర్​గా నిలిచారు. ఆయన భార్య కూడా ఐఏఎస్ అధికారే కావడం మరో విశేషం.

టోక్యో పారాలింపిక్స్​ బ్యాడ్మింటన్​లో రజతం గెలిచి భారత్​కు మరో పతకం సాధించిపెట్టారు యతిరాజ్ సుహాస్​. టోర్నీలో తన చారిత్రక ప్రస్థానాన్ని విజయవంతంగా ముగించారు. పారాలింపిక్స్​లో పతకం గెలిచిన తొలి కలెక్టర్​గానూ సరికొత్త రికార్డు సృష్టించారు.

యతిరాజ్ రజతం గెలిచి అరుదైన ఘనత సాధించారు. పారాలింపిక్స్ చరిత్రలోనే పతకం గెలిచిన తొలి ఐఏఎస్ అధికారిగా అవతరించారు.

  • ఉత్తర్​ప్రదేశ్​లోని గౌతమ్ బుద్ధ నగర్​ కలెక్టర్​గా విధులు నిర్వహిస్తూనే కఠోరంగా శ్రమించి పారాలింపిక్స్​లో సరికొత్త చరిత్ర సృష్టించారు. కంప్యూటర్​ ఇంజినీర్​ అయిన యతిరాజ్​.. ఐఏఎస్ కావాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. గతేడాది నోయిడాలో అతనికి పోస్టింగ్ ఇచ్చారు. కరోనా క్లిష్ట సమయంలో చక్కగా విధులు నిర్వర్తించారు.
  • భారత్​ కోసం పతకం సాధించడం గర్వంగా ఉందని, కానీ స్వర్ణం గెలవలేకపోయినందుకు కాస్త నిరాశగా ఉందని మ్యాచ్ అనంతరం యతిరాజ్ చెప్పారు. తొలి సెట్ గెలిచాక రెండో సెట్లోనే మ్యాచ్ ముగిస్తే బాగుండేదని అన్నారు.
  • యతిరాజ్ సతీమణి రితు సుహాస్​ కూడా ఐఏఎస్ అధికారే కావడం మరో విశేషం. గజియాబాద్ అదనపు కలెక్టర్​గా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త విజయం పట్ల ఎంతో గర్వంగా ఉందని ఉప్పొంగిపోయారు. పారాలింపిక్స్​లో భారత్​ తరఫున ఆడాలనేది ఆయన కల అని.. ఆరేళ్ల శ్రమకు అద్భుత ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.
    Paralympics: Suhas Yathiraj clinches silver in badminton SL4 class
    భారత్​కు పతకం- కలెక్టర్ల ఇంట్లో సంబరాలు
  • ఈ విజయంతో ఇద్దరి కలెక్టర్ల కుటుంబాలు సంబరాల్లో మునిగిపోయాయి. కుటుంబ సభ్యులు మిఠాయిల పంచి, డ్యాన్స్ చేసి సంతోషంలో మునిగిపోయారు.
  • పారాలింపిక్స్​లో భారత్​కు రజతం సాధించి పెట్టినందుకు యతిరాజ్​కు ఫోన్ చేసి అభినందలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆటగాళ్లు ఫలితాల గురించి కాకుండా ఆట మీదే పూర్తిగా దృష్టి సారించాలని టోర్నీకి ముందు మోదీ చెప్పిన మాటలను యతిరాజ్​ ప్రస్తావించారు.
    • #WATCH PM Modi speaks to Silver medal winner, para-badminton player and Noida DM, Suhas LY and congratulates him. Suhas recalls PM's words before the athletes left for Tokyo, where PM said to focus on their game instead of the results pic.twitter.com/icPiiDIciE

      — ANI (@ANI) September 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • యతిరాజ్​కు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ కూడా ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ విజయం పట్ల దేశం గర్విస్తోందని కొనియాడారు.

టోక్యో వేదికగా జరిగిన పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ ఎస్​ఎల్​4 విభాగంలో ఫ్రాన్స్ ఆటగాడు, వరల్డ్ నంబర్​-1 లుకాస్​ మజుర్​తో యతిరాజ్​ హోరాహోరీగా తలపడ్డారు. తొలిసెట్​ను గెలిచి ప్రపంచ ​ ఛాంపియన్​కు షాకిచ్చారు. అయితే రెండో సెట్​ను 17-21 తేడాతో, మూడో సెట్​ను 15-21తో కోల్పోయాడు. కానీ ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. 62 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. పసిడి పతకం గెలిచిన మజుర్​.. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్. యూరోపియన్ ఛాంపియన్​షిప్​లోనూ మూడు స్వర్ణాలు కైవసం చేసుకున్నాడు.

ఇదీ చదవండి: Paralympics: సిక్స్​లు కొట్టాల్సింది​.. పారాలింపిక్స్​ పతకం పట్టేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.