ETV Bharat / sports

నిఖత్​ సంచలనాలకు తెర.. కాంస్యంతో సరి

author img

By

Published : Mar 20, 2021, 6:30 AM IST

ఇస్తాంబుల్ వేదికగా జరుగుతోన్న బోస్​ఫోరస్ బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్​ కాంస్యంతో సరిపెట్టుకుంది. సెమీ ఫైనల్లో స్థానిక అమ్మాయి బసెంజ్​ చేతిలో పరాజయం పాలైంది.

Nikhat Zareen
నిఖత్​

బోస్‌ఫోరస్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్లో తెలంగాణ బాక్సర్ నిఖత్‌ జరీన్‌ సంచలనాలకు తెరపడింది. మహిళల 51 కేజీల విభాగం ప్రీక్వార్టర్స్‌లో ఎక్తరీనా (ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌, రష్యా).. క్వార్టర్స్‌లో నజీమ్‌ (రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, కజకిస్థాన్‌)ను ఓడించి ప్రకంపనలు రేపిన నిఖత్‌.. సెమీఫైనల్లో ఓడిపోయింది.

శుక్రవారం జరిగిన బౌట్‌లో జరీన్‌ 0-5తో స్థానిక అమ్మాయి బసెంజ్‌ (టర్కీ) చేతిలో పరాజయం చవిచూసింది. సెమీస్‌లో ఓడినా ఆమె కాంస్యం దక్కించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.