ETV Bharat / sports

రెజ్లర్ సుశీల్​ కుమార్​కు లుక్​ఔట్​ నోటీసులు జారీ

author img

By

Published : May 10, 2021, 11:04 AM IST

మర్డర్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్​ సుశీల్​ కుమార్​కు దిల్లీ పోలీసులు లుక్​ఔట్​ నోటీసులు జారీచేశారు. ఛత్రసాల్​ స్టేడియంలో సాగర్​ రానా అనే మల్లయోధుడి హత్యతో సుశీల్​కు సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..

Sushil Kumar, Indian star wrestler
సుశీల్​ కుమార్​, రెజ్లర్​

భారత స్టార్ రెజ్లర్​ సుశీల్​ కుమార్​కు దిల్లీ పోలీసులు లుక్​ ఔట్​ నోటీసులు జారీ చేశారు. ఛత్రశాల్​ స్టేడియంలో జరిగిన గొడవలో సాగర్​ రానా అనే మల్లయోధుడు మరణించాడు. ఈ దాడుల్లో సుశీల్​ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు బాధితుడు ఒకరు వెల్లడించాడు.

గత కొన్ని రోజులుగా బృందాలుగా ఏర్పడి సుశీల్​ కోసం వెతుకుతున్న పోలీసులకు.. అతని జాడ లభ్యం కాలేదు. దీంతో తాజాగా అతడి కోసం లుక్​ ఔట్​ నోటీసు జారీ చేశారు.

అసలేం జరిగింది?

ఛత్రసాల్​ స్టేడియంలో మంగళవారం(ఈ నెల 4న) రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఇందులో మల్లయోధులు సాగర్​, సోను, అమిత్​ల బృందంపై.. సుశీల్​ కుమార్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఇందులో సాగర్​ మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. సంఘటన స్థలంలో కొన్ని వాహనాలతో పాటు ఓ గన్ లభ్యమయ్యాయి. ఇందుకు సంబంధించి మోడల్​ టౌన్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

ఇదీ చదవండి: 'ఈ హత్య కేసులో రెజ్లర్​ సుశీల్​దే ప్రధానపాత్ర!'

బాధితుల వాంగ్మూలం ప్రకారం.. ఈ హత్య కేసులో సుశీల్​ ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతని కోసం గాలిస్తున్నారు. స్టేడియంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: గొడవల్లో రెజ్లర్ మృతిపై సుశీల్ కుమార్ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.