ETV Bharat / sports

ఐఓఏ ఉపాధ్యక్షుడు జనార్ధన్ సింగ్ కన్నుమూత

author img

By

Published : Apr 28, 2021, 4:18 PM IST

భారత ఒలింపిక్​ అసోసియేషన్(ఐఓఏ) ఉపాధ్యక్షుడు జనార్ధన్​ సింగ్ గెహ్లోట్​ కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు ఐఓఏ అధ్యక్షుడు నరేందర్ బాత్రా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Janardhan Singh Gehlot, IOA vice-president
జనార్ధన్ సింగ్ గెహ్లోట్​, భారత ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యాక్షుడు

భారత ఒలింపిక్​ అసోసియేషన్(ఐఓఏ) వైస్​ ప్రెసిడెంట్​ జనార్ధన్​ సింగ్​ గెహ్లోట్​ కన్నుమూశారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 70 ఏళ్ల గెహ్లోట్​.. రాజస్థాన్​లోని జైపూర్​లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

"గెహ్లోట్​ మృతికి భారత ఒలింపిక్​ అసోసియేషన్ తరఫున, నా వ్యక్తిగతంగా సంతాపం తెలుపుతున్నా. ఆయన ఐఓఏ వైస్​ ప్రెసిడెంట్​గానే కాకుండా రాజస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్​ అధ్యక్షుడిగానూ పదవిలో ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను."

-నరేందర్​ బాత్రా, భారత ఒలింపిక్​ అసోసియేషన్​ అధ్యక్షుడు.

జనార్ధన్​ సింగ్ మృతిపై రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోట్​తో పాటు గవర్నర్​ కల్​రాజ్ మిశ్రా సంతాపం ప్రకటించారు. రాజకీయాల్లోనూ, క్రీడలలోనూ తనదైన ముద్ర వేశారని సీఎం గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి: కోహ్లీ, రాహుల్ స్థానాలు పదిలం.. టాప్​-10లోకి​ రిజ్వాన్

గెహ్లోట్​ గతంలో రాజస్థాన్​ మంత్రిగానూ పనిచేశారు. కబడ్డీ జాతీయ సమాఖ్యకు ఏకంగా 28 ఏళ్ల పాటు(2013 వరకు) అధ్యక్షుడిగానూ కొనసాగారు. 2017లో ఐఓఏ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. దీంతో పాటు అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు.

ఇదీ చదవండి: లంక మాజీ క్రికెటర్​​ జోయ్సాపై ఆరేళ్ల నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.