ETV Bharat / sports

ఒలింపిక్స్ థీమ్ సాంగ్​ను ఆవిష్కరించిన భారత్​

author img

By

Published : Jun 23, 2021, 10:15 PM IST

olympic theme song, tokyo olympics
ఒలింపిక్ థీమ్ సాంగ్, టోక్యో ఒలింపిక్స్

టోక్యో మెగా ఈవెంట్​లో భాగంగా భారత్​ తన అధికారిక ఒలింపిక్​ సాంగ్​ను ప్రారంభించింది. ఈ పాటను మోహిత్ చౌహాన్ స్వరపరిచారు. ఐఓఏ అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి కిరెన్ రిజిజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్​లో భాగంగా భారత్​ అధికారిక ఒలింపిక్​ థీమ్​ సాంగ్​ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర క్రీడా మంత్రి కిరెన్​ రిజిజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

"లక్ష్య తేరా సామ్నే హై.. " అంటూ సాగే ఈ పాటను మోహిత్​ చౌహాన్ స్వరపరిచారు.

ఈ కార్యక్రమాన్ని భారత ఒలింపిక్​ సంఘం(ఐఓఏ) అధికారికంగా నిర్వహించింది. ఇందులో ఐఓఏ అధ్యక్షుడు నరీందర్​ బాత్రా, సెక్రటరీ జనరల్​, స్పోర్ట్స్ సెక్రెటరీ, డిప్యూటీ చెఫ్​ డి మిషన్​, స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా డీజీ హాజరయ్యారు.

టోక్యో ఒలింపిక్స్​ జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఇందులో భారత్​ నుంచి 100కి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు.

ఇదీ చదవండి: అథ్లెట్లకు హరియాణా ప్రభుత్వం బంపర్ ఆఫర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.