ETV Bharat / sports

మెస్సీపై ఫ్రాన్స్​ ఫ్యాన్స్​ ఫైర్​.. ఆ గోల్​ విషయంలో మోసం చేశాడంటూ..!

author img

By

Published : Dec 20, 2022, 6:08 PM IST

Etv Bharat
Etv Bharat

ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో మెస్సీ చేసిన రెండో గోల్‌ వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆ గోల్‌ను రెఫరీ అనుమతించడంపై ఫ్రాన్స్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

FIFA World Cup 2022 : ఫిఫా ప్రపంచకప్‌లో ఫుట్‌బాల్‌ మాంత్రికుడు లియొనెల్‌ మెస్సీ చేసిన రెండో గోల్‌పై వివాదాస్పద చర్చకు తెరలేచింది. మ్యాచ్‌ అదనపు సమయలో చేసిన ఈ గోల్‌తో అర్జెంటీనా గెలుపు ముంగిటికి చేరుకొంది. కానీ, చివరి నిమిషాల్లో కిలియన్‌ ఎంబాపె ఓ పెనాల్టీని గోల్‌గా మలిచి ఫ్రాన్స్‌ ఆశలను సజీవంగా ఉంచాడు. వాస్తవానికి మెస్సీ చేసిన రెండో గోల్‌ను రెఫరీలు ఇచ్చి ఉండాల్సింది కాదని ఫ్రాన్స్‌ అభిమానులు వాదిస్తున్నారు. మ్యాచ్‌ అదనపు సమయంలో 108వ నిమిషంలో మార్టినెజ్‌ కొట్టిన బంతి ఫ్రాన్స్‌ గోల్‌ కీపర్‌ హుగో లోరిస్‌ను తాకి వెనక్కు వచ్చింది. వెంటనే మెస్సీ దానిని కుడికాలితో కొట్టి గోల్‌లైన్‌ దాటించేశాడు. దీంతో అర్జెంటీనాకు 3-2 ఆధిక్యం లభించింది.

ఇక్కడే తిరకాసు ఉంది. మెస్సీ బంతిని కొట్టే సమయంలో అర్జెంటీనాకు చెందిన రిజర్వు ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. అప్పటికి బంతి గోల్‌ లైన్‌ దాటలేదు. ఫిఫా నిబంధనల ప్రకారం గోల్‌ చేసే సమయంలో అదనపు వ్యక్తులు( గోల్‌ చేసిన జట్టు ఆటగాళ్లు, సబ్‌స్టిట్యూట్‌లు, అధికారులు) మైదానంలో ఉంటే గోల్‌ను రెఫరీలు అనుమతించకూడదు.

గోల్‌ అనంతరం మ్యాచ్‌ను పునఃప్రారంభించే సమయంలోపు రెఫరీ ఈ విషయాన్ని గుర్తిస్తేనే గోల్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుంది. కానీ, ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో రెఫరీ సైమన్‌ మార్సినెక్‌ ఆటను చూడటంలో నిమగ్నం కావడం వల్ల ఈ విషయాన్ని గుర్తించలేదు. మరో వైపు మ్యాచ్‌ అధికారులు కూడా గుర్తించలేదని యూరోస్పోర్ట్స్‌ పత్రిక పేర్కొంది. ఈ అంశంపై ఫ్రాన్స్‌ తమ ఫిర్యాదును నమోదు చేయొచ్చు. కానీ, ఫలితాన్ని మాత్రం మార్చలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.