ETV Bharat / sports

WTC Final 2023 : టీమ్​ఇండియాకు ఇక కష్టమే.. 104 టెస్టుల్లో 26 సార్లు మాత్రమే అలా!

author img

By

Published : Jun 10, 2023, 7:52 AM IST

Updated : Jun 10, 2023, 8:45 AM IST

WTC Final 2023 IND VS AUS : వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్​లో ఇంకా మూడు రోజుల ఆటే ముగిసింది. కానీ అప్పుడే భారత్‌కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఓవల్‌ మైదానం రికార్డును పరిశీలిస్తే.. అద్భుతాలు జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమిని నుంచి తప్పుకోవడం కష్టమే అనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

WTC Final 2023
WTC Final 2023

WTC Final 2023 IND VS AUS : వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్​లో మూడు రోజుల ఆట అయింది. ఈ ఫైనల్​లో మొదటి రెండు రోజులు కంగారు జట్టు ఆధిపత్యం ప్రదర్శించగా.. మూడో రోజు ఆటలో మాత్రం భారత్​ మెరుగైన ప్రదర్శన చేసింది. అయినప్పటికీ మ్యాచ్‌లో కంగారూలదే పైచేయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్​ 296 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక నాలుగో రోజు ఆటలో రాణించి 400 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించేలా కనిపిస్తోంది. కాబట్టి ఛేదన భారత్‌కు కఠిన సవాల్​ అనే చెప్పాలి. దీంతో మనోళ్లకు గెలిచే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

Oval highest Run Chase In Tests : ఓవల్‌ స్టేడియం రికార్డులను పరిశీలిస్తే... అద్భుతాలు జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్​ జట్టు ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ మైదానంలో అత్యధిక ఛేదన 263 మాత్రమే ఉంది. అది కూడా చాలా కాలం.. 121 ఏళ్ల కింద. ఆస్ట్రేలియా జట్టుపై ఇంగ్లాండ్‌ టీమ్​ సాధించింది. కానీ ఇప్పుడు కంగారు జట్టు ఆధిక్యం ఇప్పటికే 296కు చేరుకుంది. ఇంకా ఆ టీమ్​ చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. దీంతో లక్ష్యం 350 నుంచి 400కు చేరువయ్యే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి.

మరో విషయమేమిటంటే.. ఈ మైదానం వేదికగా జరిగిన 104 టెస్టు మ్యాచుల్లో 26 సార్లు మాత్రమే నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించిన జట్లు విజయాన్ని సాధించాయి. కాబట్టి ఈ ఫలితాలు చూస్తుంటే.. నాలుగో ఇన్నింగ్స్‌లో టీమ్​ఇండియా ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమనే అనిపిస్తోంది. అంటే డబ్ల్యూటీసీ ట్రోఫీని ముద్దాడే విషయంలో మళ్లీ నిరాశే ఎదురవచ్చు. ఒకవేళ చివరి రెండు రోజుల్లో, రిజర్వ్‌ డే రోజు కూడా వర్షం పడితే కానీ.. భారత్​ ఓటమిని తప్పించుకోవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

గబ్బా రిపీట్‌ అవుతుందా?(Gabba test 2021).. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో.. రహానే నేతృత్వంలోని గబ్బా టెస్టు(నాలుగో మ్యాచు)లో భారత్​కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ భారత్​ ఒత్తిడిని జయించి చారిత్రక విజయాన్ని అందుకుంది. కంగారు జట్టు విధించిన 329 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి మరి మ్యాచ్​ను గెలిచింది. అయితే అప్పుడు రిషబ్‌ పంత్‌ (89*), శుభ్​మన్‌ గిల్‌(91) , పుజారా (56) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు.

ఇక ప్రస్తుత డబ్ల్యూటీసీ ఫైనల్​లో మూడు రోజుల్లో 296 పరుగులతో ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. ​ నాలుగో రోజు ఆటలో 350 నుంచి 400 పరుగులు చేసే అవకాశం ఉంది. అయితే ఈ నాలుగు రోజు ఆటలో టీమ్​ఇండియా బౌలర్లు విజృంభించి 330-340 పరుగులలోపు ఆలౌట్​ చేస్తే.. భారత్​కు కలిసొచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆటకు ఇంకో రోజున్నార వరకు సమయం ఉంటుంది. గబ్బాలోలాగా టీమ్​ఇండియా బ్యాటర్లు మెరుగైన ప్రదర్శనతో కాస్త నిలకడగా ఆడితే.. విజయాన్ని అందుకోవచ్చు.

Last Updated : Jun 10, 2023, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.