ETV Bharat / sports

సచిన్ దాతృత్వం.. ఆస్పత్రికి వైద్య పరికరాలు సాయం

author img

By

Published : Nov 4, 2021, 8:51 AM IST

sachin
సచిన్ తెందూల్కర్

క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్(Sachin News) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సేవా సంస్థ ద్వారా అసోం కరీమ్​గంజ్​ జిల్లా ఆస్పత్రికి రెటినాల్ కెమెరాలు సాయంగా అందించారు.

టీమ్​ఇండియా దిగ్గజం సచిన్​ తెందూల్కర్(sachin news latest) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు సాయం చేసేందుకు ముందడుగు వేశారు. అసోం కరీమ్​గంజ్ జిల్లా మకుంద క్రిస్టియన్ కుష్ఠు, జనరల్ ఆస్పత్రిలోని పెడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్​కు రెటినాల్ కెమెరాలను సాయంగా అందించారు.

తన సేవా సంస్థ తరపున ఈ సహాయం చేశారు సచిన్. పసిపిల్లలు, చిన్నారుల్లో అంధత్వం రాకుండా నివారించే థెరపీకి పరీక్షల నిమిత్తం రెటినాల్ కెమెరాలు ఉపయోగపడుతాయి. వీటితో చాలా మందికి లాభం కలుగుతుందని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.

త్రిపుర, మిజోరామ్​కు చెందిన ప్రజలు కూడా పరీక్షల కోసం తరచూ కరీమ్​గంజ్ ఆస్పత్రికి వెళ్తుంటారు. అయితే.. ఆర్​ఓపీ స్క్రీనింగ్ సేవలు పొందాలంటే రోగులు దాదాపుగా 360 కిలోమీటర్లు ప్రయాణించి గువాహటికి వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్య నుంచి వారిని ఆదుకోవడానికే సచిన్ ఈ సాయం చేశారు.

ఇదీ చదవండి:

విరాట్ భయ్యా.. టాస్ ఎప్పుడు గెలుస్తావ్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.