న్యూజిలాండ్​పై సిరీస్ విజయం.. టెస్టుల్లో అగ్రస్థానానికి భారత్

author img

By

Published : Dec 6, 2021, 2:29 PM IST

Team India
Team India ()

ICC Test Ranklings: న్యూజిలాండ్​తో జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. దీంతో కివీస్​తో జరిగిన రెండు టెస్టుల సిరీస్​ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఫలితంగా ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో అగ్రస్థానం దక్కించుకుంది టీమ్ఇండియా. న్యూజిలాండ్ రెండుకు పడిపోయింది.

ICC Test Ranklings: న్యూజిలాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది టీమ్ఇండియా. వాంఖడే వేదికగా జరిగిన రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో జయభేరీ మోగించింది. ఈ నేపథ్యంలోనే ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్​లో అగ్రస్థానం కైవసం చేసుకుంది భారత జట్టు. న్యూజిలాండ్​ను వెనక్కు నెట్టి నెంబర్​ వన్ ర్యాంకు దక్కించుకుంది.

న్యూజిలాండ్​తో జరిగిన మొదటి టెస్టును డ్రా చేసుకున్న భారత్​.. రెండో టెస్టులో ఘనవిజయం సాధించింది. దీంతో ప్రస్తుతం 124 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది కోహ్లీసేన. న్యూజిలాండ్ (121 పాయింట్లు), ఆస్ట్రేలియా (108 పాయింట్లు), ఇంగ్లాండ్ (107 పాయింట్లు), పాకిస్థాన్ (92 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇవీ చూడండి: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.