ETV Bharat / sports

T20 World Cup: భారత్​ x జింబాబ్వే.. సెమీస్​ రేసులో నిలిచేదెవరో?

author img

By

Published : Nov 5, 2022, 4:35 PM IST

Updated : Nov 5, 2022, 4:49 PM IST

Etv Bharat
Etv Bharat

టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి టీమ్​ఇండియా సిద్ధమైంది సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పసికూన జింబాబ్వేతో రోహిత్‌ సేన రేపు తలపడనుంది ఈ మ్యాచ్‌లో భారత్‌ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా జింబాబ్వేను తక్కువ అంచనా వేస్తే షాక్‌ తప్పకపోవచ్చు టాప్​ ఆర్డర్​ భీకర ఫామ్‌కు తోడు బౌలర్లు రాణిస్తుండడంతో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది ఈ మెగా టోర్నీలో ఇప్పటికే పాకిస్థాన్​ కోలుకోలేని షాక్‌ ఇచ్చిన జింబాబ్వే మరోసారి అదే ఫలితం పునారవృతం చేసి టోర్నీని ముగించాలి చూస్తోంది.

పొట్టి ప్రపంచకప్‌లో మరో కీలక మ్యాచ్‌కు టీమ్​ఇండియా సిద్ధమైంది. సెమీఫైనల్‌ చేరాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో పసికూన జింబాబ్వేతో పోరుకు రోహిత్‌ సేన సమాయత్తమైంది. ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు ఈ కీలక మ్యాచ్‌లోనూ సాధికార విజయం సాధించి సెమీఫైనల్లో ఘనంగా అడుగుపెట్టాలని వ్యూహాలు రచిస్తోంది. విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌ సూపర్ ఫామ్‌కు తోడు రాహుల్‌ కూడా ఫామ్‌ అందుకోవడం టీమ్​ఇండియాకు కలిసి రానుంది. గత నాలుగు మ్యాచ్‌లో 74 పరుగులే చేసిన సారధి రోహిత్‌ శర్మ నుంచి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. హార్దిక్‌ పాండ్యా దినేశ్‌ కార్తీక్‌, అశ్విన్‌లతో కూడిన టీమ్​ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ చాలా బలంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో దీపక్‌ హుడాకు తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. కార్తీక్‌ స్థానంలో పంత్‌ను తీసుకోవాలన్న డిమాండ్‌లు పెరుగుతున్న దృష్ట్యా టీమ్‌ మేనెజ్‌మెంట్‌ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

బౌలింగ్‌లోనూ టీమ్​ఇండియా బలంగా కనిపిస్తోంది. ఆరంభ ఓవర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండగా అర్ష్‌దీప్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. షమీ కూడా ఫామ్‌లో ఉండడంతో పేస్‌ విభాగంలో భారత జట్టు పటిష్టంగానే ఉంది. కానీ స్పిన్‌ విభాగం టీమ్​ఇండియాను కలవరపాటుకు గురిచేస్తోంది. అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ భారీగా పరుగులు సమర్పిస్తుండడం మేనేజ్‌మెంట్‌లో ఆందోళనను పెంచుతోంది. అశ్విన్‌ బ్యాట్‌తో పర్వాలేదనిపిస్తున్నా బాల్‌తో రాణించలేకపోతున్నాడు చాహల్‌కు జట్టులో స్థానం దక్కుతుందన్న అంచనాలు ఉన్నాయి.

ఈ మెగా టోర్నమెంట్‌లో జింబాబ్వే స్థాయికి మించి రాణిస్తోంది. పాకిస్థాన్​కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన జింబాబ్వే బంగ్లాదేశ్‌ను ఓడించినంత పని చేసింది. రెగిస్ చకబ్వా సారథ్యంలోని జట్టు అద్భుతంగా ఆడుతోంది. బౌలింగ్‌లో జింబాబ్వే మెరుగ్గా రాణిస్తోంది. పాక్‌పై 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా జింబాబ్వే కాపాడుకుంది. మరి పొడవైన జింబాబ్వే బౌలర్లుఫామ్‌లో ఉన్న టీమ్​ఇండియా బ్యాటర్లకు ఏమాత్రం సవాల్‌ విసురుతారో చూడాలి. బ్యాటింగ్‌ విభాగంలో జింబాబ్వే బలహీనంగా కనిపిస్తోంది. పాక్‌లో జన్మించిన సికిందర్ రాజా ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడిపై జింబాబ్వే భారీ ఆశలు పెట్టుకుంది. సికిందర్‌ రాజాతో భారత్‌కు ముప్పు పొంచి ఉందని మాజీలు హెచ్చరిస్తున్నారు.

వర్షం వల్ల భారత్-జింబాబ్వే మ్యాచ్‌ రద్దైతే చెరో జట్టుకు ఒక్కో పాయింట్‌ కేటాయిస్తారు. అప్పుడు రోహిత్‌ సేన ఏడు పాయింట్లతో సెమీస్‌లో అడుగు పెడుతుంది. బంగ్లాదేశ్‌పై పాక్‌ నెగ్గినప్పటికీ ఆరు పాయింట్లే ఉంటాయి కాబట్టి బాబర్‌ సేన ప్రపంచకప్‌ నుంచి నిష్ర్కమిస్తుంది.

ఇదీ చూడండి: అది కోహ్లీ రేంజ్ అంటే ఈ రన్​ మెషీన్ సూపర్​ రికార్డ్స్​ తెలుసా

Last Updated :Nov 5, 2022, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.